టాలీవుడ్ స్టార్ హీరోలు సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానానికి అతి దగ్గరగా ఉన్న నటులు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదంటున్నారు సినీ విశ్లేషకులు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో మెగాస్టార్ సోదరుడిగా పవన్, రాజకుమారుడు మూవీతో సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా మహేష్ బాబు టాలీవుడ్ కి హీరోలుగా రంగప్రవేశం చేసారు. ఇక ఈ ఇద్దరు హీరోలు తొలి సినిమా నుండి ఒక్కొక్కటిగా అనేక భారీ సక్సెస్ లు సొంతం చేసుకుంటూ హీరోలుగా తమ కెరీర్ లో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ ఇద్దరు బడా స్టార్స్ కి కోట్లలో అభిమానులు ఉండడంతో పాటు ఎందరో ప్రేక్షకుల సైతం వీరి సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే చాలు వాటిని చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక క్రేజ్, పాపులారిటీ, మార్కెట్ పరంగా దాదాపుగా సమాన స్థాయిలో కొనసాగుతున్న ఈ ఇద్దరూ కలిసి ఒక్క సినిమా చేస్తే చూడాలి అనేది వారి వారి అభిమానుల ఆశ మాత్రమే కాదు, అనేకమంది ప్రేక్షకులు కూడా ఆ ప్రత్యేక మూవీ కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. నిజానికి వీరిద్దరి కాంబో మూవీని కొన్నేళ్ల క్రితం త్రివిక్రమ్ సెట్ చేసారు అనే వార్తలు వైరల్ అయినప్పటికీ దానిపై ఎటువంటి అధికారిక న్యూస్ బయటకు రాలేదు.

అయితే అసలు విషయంలోకి వెళితే, నేడు కొందరు అభిమానులు మహేష్ శ్రీమంతుడు, అలానే పవన్ అజ్ఞాతవాసి సినిమాల్లోని రెండు పిక్స్ ని కలిపి ఎడిట్ చేసి ఒక్కటిగా జత చేసారు. చూడడానికి అచ్చం ఒరిజినల్ పిక్ మాదిరిగా ఉన్న మహేష్, పవన్ ల ఆ ఫ్యాన్ మేడ్ ఫోటో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుండగా, అది చూసిన అనేకమంది ప్రేక్షకాభిమానులు, వీరిద్దరూ ఆ పిక్ లో ఎంతో అద్భుతంగా ఉన్నారని, త్వరలో ఈ ఇద్దరూ కలిసి వెండితెర పై కనపడే సినిమా రావాలని కోరుకుంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: