దగ్గుపాటి రానా తొలిసారిగా హీరోగా పరిచయం అయిన చిత్రం లీడర్. ఈ సినిమాని డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా మొత్తం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో చిత్రీకరించారు. ఇక ఈ సినిమా హీరో రానా కి ఒక అద్భుతమైన విజయాన్ని దక్కించింది. రాజకీయ సినిమాలలో ఏదైనా సినిమా మాట్లాడుకోవాల్సిన వస్తే ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడతారు.


అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా సీక్వెల్ నేపథ్యంలో వినిపిస్తున్న మాటలు ఏమిటంటే... జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా సీక్వెల్ ను తెరకెక్కించబోతున్నట్లుగా సమాచారం. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రసంగాలలో మాట్లాడే మాటలు, ఆయన చేసేటువంటి సేవలకు డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఫిదా అవడంతో ఈ సినిమాని లీడర్ సినిమా సీక్వెల్ రేంజ్ లో చేయబోతున్నట్లు తెలుస్తోంది.


ఇక 2019 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో పవన్ అతి ఘోరంగా ఓడిపోయిన కేవలం ఒక్క సీటును మాత్రం గెలిచాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నిలబడిన చోట మాత్రం ఓడిపోయాడు. అలా ఎందుకు ఓడిపోయాడు అనే విషయం ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. ఇక రాబోయే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఎటువంటి పార్టీకి సపోర్ట్ చేయకుండా తానే స్వతహాగా బరిలోకి దిగబోతున్నారున్నట్లుగా తెలియజేశారు. ఇక ఇదే సందర్భంలో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో ఒక సినిమా చేస్తే బాగుంటుంది అనే నేపథ్యంలో ఈ విషయం పుట్టుకొచ్చిందన్నట్లుగా సమాచారం.

ఇక ఈ సినిమాని సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు విడుదల చేస్తే పవన్ కళ్యాణ్ కు సరైన ఇమేజ్ పెరుగుతుందని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.అంతే కాకుండా పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అంటూ అరిచిన వారే ఓటు పవన్ కళ్యాణ్ కు ఓటు వేయలేదని వార్తలు ఈ మధ్యకాలంలో బాగా వినిపించాయి. అయితే ఈ సినిమాని గతంలో లీడర్ సినిమాను రానా తీయగా ఇప్పుడు ఈ సినిమాకి పవన్ ఒప్పుకుంటాడా లేదా అనే సందిగ్ధం లో ఉన్నారు ఆయన అభిమానులు

మరింత సమాచారం తెలుసుకోండి: