అల్లు
అర్జున్ హీరో గా నటించిన మొదటి పాన్
ఇండియా సినిమా పుష్ప చిత్రం పై ఎంతటి భారీ అంచనాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కోసం తెలుగు ప్రజలు మాత్రమే కాకుండా యావత్ దేశ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ
సినిమా తప్పకుండా
సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు మంచి నమ్మకంతో వున్నారు.
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ
సినిమా చేస్తుండగా బడ్జెట్ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయటం లేదు వీరు.
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం రెండు వందల యాభై కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాంటి ఈ
సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుందో అన్న ఆసక్తిని ప్రతి ఒక్కరు కనబరుస్తున్నారు. సౌత్
ఇండస్ట్రీ లో కలెక్షన్స్ అనే విషయం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. ఒక
సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో చెప్పడానికి ఓపెనింగ్ కలెక్షన్లను అంచనా వేస్తారు. హిందీలో కూడా ఈ
సినిమా తప్పకుండా అనుకున్నంత రేంజ్ లో
సక్సెస్ అవుతుందనేది మేకర్స్ అంచనా.
అయితే ఇంతవరకు
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాపై అనుకున్నంత స్థాయిలో బజ్ క్రియేట్ అవ్వలేదు. కానీ
అల్లు అర్జున్ ఈ
సినిమా విడుదల అయ్యే సమయానికి తప్పకుండా
బాలీవుడ్ లో మంచి క్రేజ్ తీసుకువచ్చే విధంగా ఆలోచనలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను
బాలీవుడ్ లో ప్రమోట్ చేసే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇక
బాహుబలి సినిమా తప్పా ఏ తెలుగు
సినిమా కి ఓపెనింగ్ కలెక్షన్లు భారీగా రాలేదు.
సైరా లాంటి చారిత్రాత్మక చిత్రానికి కూడా భారీ ఓపెనింగులు రాలేదు. ఈ నేపథ్యంలో
అల్లు అర్జున్ బాలీవుడ్ లో ఎలాంటి ఓపెనింగ్ కలెక్షన్లు ను అందుకుని సూపర్ హిట్ కొడతాడో అన్న అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది.