మన తెలుగులో చాలా మంది హీరోలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నారని విషయం గత కొన్ని రోజుల నుంచి కొన్ని సినిమాలను చూస్తే అర్థమవుతుంది. ఇటీవలి కాలంలో కొంతమంది చిన్న చిన్న హీరోలు కూడా నిర్మాతగా మారడానికి ప్రయత్నం చేస్తూ కొంత మంది హీరోలతో సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నానీ తెలుగు లో ఎక్కువగా సినిమాల్లో నిర్మాతగా వ్యవహరించాలని రెడీగా ఉన్నాడని ఈ నేపథ్యంలోనే కొంత మంది హీరోలతో కూడా మాట్లాడుతున్నాడని కొన్ని కొన్ని కథలను కూడా సిద్ధం చేసుకుని హీరోలకు పంపించాడు అని అంటున్నారు.

ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో నానీ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందనే ప్రచారం కూడా కాస్త ఎక్కువగానే జరుగుతుంది. ఇక దగ్గుబాటి హీరో రానా తో నిర్మాతగా ఒక సినిమాను చూసేందుకు నానీ  ఒక కథ కూడా సిద్ధం చేశాడని ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగ ఒక కథ రెడీ చేయగా రానాకు సరిగ్గా సరిపోతుందని అందుకే ఇప్పుడు ఈ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నాడని అంటున్నారు.

ఏది ఎలా ఉన్నా సరే ఈ సినిమా విషయంలో నానీ కాస్త పట్టుదలగా ఉన్నాడు అని రానా కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమాను మొదలు పెట్టే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఈ సినిమాలో వెంకటేష్ కూడా గెస్ట్ రోల్ చేసే అవకాశం ఉండవచ్చని అలాగే ఈ సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ ని కూడా తీసుకునే అవకాశం ఉండొచ్చని ప్రచారం మొదలైంది. ఈ సినిమాలో నానీ  నెగిటివ్ రోల్ చేసే అవకాశం ఉందని దానికి కూడా రానా ఏ అభ్యంతరం చెప్పలేదని సమాచారం.దీనిపై త్వరలో ఒక క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: