టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సినిమాల పరంగా వరుసగా భారీ సక్సెస్ లు సొంతం చేసుకుంటూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మూడేళ్ళ క్రితం కొరటాల తీసిన భరత్ అనే నేను, అలానే ఆ తరువాత వంశీ పైడిపల్లి తీసిన మహర్షి, అనంతరం అనిల్ రావిపూడి తీసిన సరిలేరు నీకెవ్వరు మూవీస్ తో హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్న సూపర్ స్టార్, ప్రస్తుతం చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. పరశురామ్ పెట్ల తీస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా యాక్ట్ చేస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ మూవీపై మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కారణంగా సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా ఏప్రిల్ 1కి వాయిదా పడ్డ విషయం తెలిసిందే. అయితే విషయం ఏమిటంటే తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రేక్షకాభిమానులతో టచ్ లో ఉంటూ తన సినిమాలు, వ్యక్తిగత విషయాలకు సంబదించిన మ్యాటర్ వారితో షేర్ చేసుకునే అలవాటుగల సూపర్ స్టార్ మహేష్ బాబు, నేడు అందరికీ ఒక్కసారిగా భారీ షాక్ ఇచ్చారు. నేడు కొద్దిసేపటి క్రితం తనలో కొద్దిపాటి కరోనా లక్షణాలు కనపడడంతో కరోనా టెస్ట్ చేయించుకున్నానని, అయితే రిపోర్ట్ లో కరోనా పాజిటివ్ అని తేలిందని తన పోస్ట్ లో తెలిపారు సూపర్ స్టార్.

ఇటీవల నాతో మాట్లాడిన వారు, అలానే నాతో కాంటాక్ట్ అయిన వారందరూ కూడా ఒకసారి టెస్ట్ చేయించుకోండని, అలానే ఈ మహమ్మారిని అంత తేలికగా తీసుకోవద్దు, దయచేసి ఇప్పటివరకు వ్యాక్సిన్ వేయించుకోని వారందరూ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేయించుకోవాలని మహేష్ బాబు కోరారు. ఇక ప్రస్తుతం తాను ప్రత్యేకంగా హోమ్ ఐసోలేషన్ లో ఉండి డాక్టర్ల సలహాతో చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు మహేష్. ఇటీవల తన మోకాలికి శస్త్ర చికిత్స జరగడంతో కొన్నాళ్లుగా తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లి కొన్నాళ్ల పాటు అక్కడే రెస్ట్ తీసుకున్న మహేష్ బాబు, నిన్న కుటుంబంతో సహా హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఇంతలోనే ఆయనకి కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా కోట్లాదిమంది ఫ్యాన్స్ తోపాటు అనేకమంది ప్రేక్షకులు, టాలీవుడ్ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మెసేజెస్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: