ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ ఎవరు ఉన్నారు అంటే పూజా హెగ్డే రష్మిక మందన అనే చెప్పాలి. వీరిద్దరు కూడా ఇప్పుడు వరుస తెలుగు చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న వారే. పెద్ద సినిమాలు సైతం వారి చేతిలో ఉన్నాయి. అయితే వీరి చేతిలో ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి అంటే వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. పూజా హెగ్డే బ్రాండ్ అంబాసిడర్ గా కొన్ని ప్రొడక్ట్ లకే ఉంది. ఎక్కువ బ్రాండ్ లకు అంబాసిడర్ గా లేదు అని చెప్పాలి. బాలీవుడ్ లో చిన్న హీరోయిన్ స్థాయిలో కూడా ఈమెకు బ్రాండ్లు లేవు అంటే ఇదే మరి ఎందుకు ఈమె బ్రాండ్స్ విషయంలో వెనకడుగు వేస్తుందో తెలియదు కానీ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సూత్రాన్ని పాటిస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమాలు చేస్తే కోట్ల పారితోషికం వస్తుంది సరే యాడ్ లలో చేస్తే తప్పకుండా వారికి తక్కువ రోజుల్లోనే ఎక్కువ పారితోషకం వస్తుంది. అందుకే ఈ మధ్య సినిమాలు తగ్గించి యాడ్స్ మీద దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. అందుకే రోజురోజుకు ఆమె కనిపించే గాడ్స్ ఎక్కువైపోతున్నాయి. సినిమాల్లో కనిపించడం తక్కువైపోతుంది. ఒక రోజుకు ఒక యాడ్ కు వచ్చే మొత్తం సంవత్సరం సినిమా చేస్తే వచ్చే మొత్తానికి సమానం. ఏదేమైనా హీరోయిన్ లు తమ సోషల్ మీడియా ఎటువంటి ఉపయోగం లేదని కూడా వారు ముందుగానే ఈ విధంగా సర్దుకోవడం అభిమానులకు సంతోషాన్ని కలగచేస్తుంది. హీరోయిన్లు మధ్య పోటీ కూడా బాగానే ఉంటుంది కాబట్టి వారు ఏం చేసినా తొందరగా చేయాలి.