టైం ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవ్వరు చెప్పలేరు. ఎంతో హ్యాపీగా అన్యోన్యంగా ఉండే సమంత నాగ చైతన్య జంట విడిపోతుందని ఎవ్వరైనా కలలో నైనా ఊహించామా..లేదే..కానీ వాళ్లు విడాకులు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. అదే టైం అంటే. విధి ఆడిన వింత నాటకంలో బలైపోయారు చై-సామ్ . అయితే వీళ్లు విడాకులు తీసుకొవడానికి సిద్ధపడ్డి ఎంత బాధపడుతున్నారో తెలియదు కానీ..వీరి అభిమానులు మాత్రం ఓ రేంజ్ లో ఫీల్ అవుతున్నారట.

చైతన్య సమంత మళ్లీ కలవాలని కొందరు సోషల్ మీడియాలో మెసేజ్ లు పెడుతుంటే..మరికొందరు అయితే ఏకంగా పూజలు కూడా చేస్తున్నారట. ఇక ఆ లిస్ట్ లోకి ఇప్పుడు ఓ లేడీ డైరెక్టర్ కూడా చేరిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సమంతకు పెళ్లి తరువాత పడిన అతి పెద్ద హిట్ సినిమా ఓ బేబీ. ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ పేరే నందిని రెడ్డి. ఈ సినిమా షూటింగ్ టైంలోనే సమంత-నందిని బాగా క్లోజ్ అయ్యారట. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే చైతన్య, సమంత కలిసి ఆమె డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇద్దరు ఓకే చెప్పడంతో నందిని కధ కూడా సిద్ధం చేసుకుందట.

కానీ ఇప్పుడు వాళ్లు కలిసి లేరు. విడాకులు తీసుకుని ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఇక ఇలాంటి టైంలో వాళ్లతో సినిమా ను తెరకెక్కించడం చాలా కష్టం. ఎన్నో ఆశలతో కధను సిద్ధం చేసుకున్న నందినీ రెడ్డికి చై-సామ్‌ విడాకులు ప్రకటించి పెద్ద షాక్‌ ఇచ్చారనే చెప్పాలి. ఇక ప్రస్తుతం వాళ్ళు  ఉన్న పోజీషన్ లో ఎవ్వరు చెప్పినా కలిసి వర్క్ చేయరు. ఇక నందిని రెడ్డి కోరిక తీరాలంటే ఆ దేవుడే ఏదో మాయ చేసి..వాళ్లను కలపాలి. లేదంటే చై-సామ్‌తో నందినీ రెడ్డి తెరకెక్కించాలి అనుకున్న ఆశలు ఆమె వదులుకోవాలి అంటున్నారు నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: