అందాల ముద్దుగుమ్మ సమంత, నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే విజయం సాధించడంతో పాటు సమంత అందచందాలకు, నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు తగ్గడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన సమంత అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ఇలా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే సమంత అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించి పెళ్ళాడింది, అయితే వీరిద్దరికి గత కొంత కాలం క్రితమే విడాకులు కూడా అయ్యాయి,  నాగ చైతన్య తో విడాకులు అయిన తర్వాత సమంత తన స్పీడ్ ను మరింత పెంచింది, ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను శరవేగంగా పూర్తి చేస్తున్న సమంత,  మరి కొన్ని క్రేజీ సినిమాలను కూడా లైన్ లో పెడుతోంది.

ఇప్పటికే తెలుగులో శాకుంతలం సినిమాను పూర్తి చేసిన సమంత ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది, అలాగే హాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేయడానికి సమంత ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, అలాగే ఇప్పటికే ఫ్యామిలీ మాన్ సీజన్ టు వెబ్ సిరీస్ ద్వారా ఇండియా రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్న సమంత మరొకసారి ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ దర్శకులతో పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఇలా వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సమంతకు సంబంధించి మరో విషయం తాజాగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది, యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ సమంతతో మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకుందట. బాలీవుడ్ లో యశ్ రాజ్ ఫిలింస్ కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే, దాంతో ఆ ప్రాజెక్ట్ లకు సమంత ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: