మొన్నటి వరకు కేవలం సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు మాత్రమే సినిమాల్లోకి  ఎంట్రీ ఇచ్చేవారు. కానీ ఇటీవల కాలం లో పొలిటీషియన్ ల వారసులు సైతం సినిమా ల్లోకి ఎంట్రీ ఇస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇప్పుడు కన్నడ మాజీ మంత్రి పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు గాలి కిరీటి రెడ్డి  హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమా ఇటీవలే ఎంతో ఘనంగా ప్రారంభమైంది. వారాహి చలన చిత్ర పతాకంపై తెలుగు కన్నడ భాషల్లో  ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక మాయాబజార్ అనే కన్నడ సినిమాతో గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించ పోతున్నాడు.


 ఈ సినిమా లో పెళ్లి సందడి ప్రేమ్ శ్రీలీల నటిస్తుండగా కన్నడ స్టార్ రవిచంద్రన్, జెనీలియా కూడా కీలక పాత్రలో నటిస్తూ ఉండడం గమనార్హం . అంతే కాదండోయ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక బాహుబలి సినిమా లాంటి అద్భుతాలు సృష్టించిన సినిమాటోగ్రఫర్ సెంథిల్ ఈ సినిమాకు పని చేయబోతున్నారు. అయితే ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఓపెనింగ్ షాట్ ప్రారంభం కాగా... సీనియర్ నటుడు రవిచంద్రన్ కెమెరా స్విచాన్ చేయగా.. రాజమౌళి క్లాప్ కొట్టారు.


 ఈ సందర్భం గా మాట్లాడిన రాజమౌళి కిరీటి ని పరిచయం చేస్తూ క్లాప్ కొట్టాడం  ఎంతో సంతోషం గా ఉంది.  తన లుక్స్ ఎంతో బాగున్నాయి. నటుడు కావలసిన అన్ని అర్హతలు అతని లో ఉన్నాయ్. నటన డాన్స్ ఫైట్స్ అన్నిటినీ బాగా చేయగలడు. వారాహి బ్యానర్లో కిరిటీ మొదటి సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఇక రాజమౌళి ఇంతలా ప్రశంసించడం తో ఈ హీరో ఎవరబ్బా అని అందరూ వెతకడం ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: