ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లోనే బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షోగా కొనసాగుతుంది ఈ టీవీలో ప్రసారమయ్యే ఢీ షో. ఇక ఈ కార్యక్రమంలో కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశం నలుమూలల నుంచి కూడా ఎంతోమంది కంటెస్టెంట్ లు  డాన్స్ మాస్టర్ లు వచ్చే పాల్గొంటూ  ఉంటారు. ఇక ఇలా ఈ షోలో పార్టిసిపేట్ చేసి తర్వాత కాలంలో ఏకంగా డాన్స్ మాస్టర్ లుగా ఎదిగారు అని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డాన్స్ మాస్టర్ లుగా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ సైతం ఒకప్పుడు ఢీ షో లో కంటెస్టెంట్ గా వచ్చిన వారే.


 అయితే ఒకప్పుడు కేవలం డాన్సులకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఢీ షో  ఇప్పుడు మాత్రం డాన్స్ లతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తుంది. ఈ క్రమంలోనే ఏకంగా కామెడీ షో లను మంచి ఎంటర్టైన్మెంట్ అందుతోంది అన్న విషయం తెలిసిందే  అయితే మొన్నటివరకు ఢీ షో లో జడ్జిగా హీరోయిన్ పూర్ణ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే  సినిమాల కంటే ఎక్కువగా ఢీ షో ద్వారా మరింత పాపులారిటీ సంపాదించింది అని చెప్పాలి. తనకు పర్ఫామెన్స్ నచ్చిందంటే చాలు తనదైన శైలిలో జడ్జిమెంట్ ఇస్తూ ఎప్పుడూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయేది. ఆ తర్వాత కాలంలో మాత్రం ఢీ మానేసింది పూర్ణ.



 ఎందుకు అన్న అనే విషయం మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా ఢీ మానేయడానికి గల కారణం ఏంటి అన్న విషయం చెప్పుకొచ్చింది. శ్రీదేవి డ్రామా కంపెనీ లోకి ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళు ఒక హగ్గు ఒక కిస్ ఇవ్వాలి అంటూ హైపర్ ఆది అడుగుతాడు. ఆది నువ్వు ఢీ షో లో కిస్ అడగటం  వల్లే ఆ షో మానేశాను. ఇక ఇప్పుడు కూడా అడిగితే ఈ షో కూడా మానేయాల్సి వస్తుంది అంటూ పూర్ణ చెబుతుంది. దీంతో పూర్ణ కేవలం ఫన్నీ గా ఈ ఆన్సర్ చెప్పిందా లేకపోతే నిజంగానే ఆ కారణంతోనే ఢీ మానేసిందా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: