హీరో రానా నటిస్తున్న తాజా చిత్రం విరాట పర్వం. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు రానా అభిమానులు. ఇక ఇందులో సాయి పల్లవి అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఇక సాయి పల్లవి ప్రమోషన్లలో రానా కంటే కాస్త ఎక్కువగానే ప్రాముఖ్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఇందులో మరొక హీరోయిన్ ప్రియమణి కూడా నటించడం జరిగింది. ఒక పెద్ద హీరో అయి ఉండి కూడా తన సినిమా ప్రమోషన్లలో సాయిపల్లవి పేరును ఎక్కువగా ప్రస్తావించడం.. ఆమె పోస్టర్లను ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంతో ఇప్పుడు ఈ విషయంపై హాట్ టాపిక్ గా మారుతోంది ఇండస్ట్రీలో.


ముఖ్యంగా ట్రైలర్ లాంచ్ సంబంధించిన పోస్టర్ లో కూడా రానా ఫేస్ ను కనిపించకుండా సాయి పల్లవి మాత్రమే చూపిస్తూ ఉన్నారు. ఈ పోస్టర్ సినిమా పైన మరింత ఆసక్తి పెరిగేలా కనిపిస్తోంది. అయితే కొంత మంది మాత్రం ఈ పోస్టులకు మిశ్రమ స్పందన అని తెలియజేయడం జరిగింది. అయితే ఒక వ్యక్తి మాత్రం రాను అవమానించినట్లు గా వెయిట్ చేశారు అని తెలిపారు. తన సొంత బ్యానర్ లో సినిమా చేసినా కూడా ఫేస్ చూపించక పోవడం చాలా దరిద్రం అని తెలియజేశారు.మరి కొందరు మాత్రం ఇతర సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు,తక్కువ పాత్రలు చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ ట్వీట్ కు రానా స్పందిస్తూ.. మీ అద్భుతమైన స్పందనకు సమాధానంకు అభినందనలు తెలియజేస్తూ కామెంట్ చేశాడు. ఇంతకీ రానా ఏమన్నారు అంటే.. మనం తగ్గి కథను మరియు హీరోయిన్ ను ఎలివేట్ చేస్తే ఆ కిక్కే వేరే బ్రదర్ అని తెలిపారు. తన సొంత బ్యానర్ లో కూడా ఇలాంటి గొప్ప పనులు చేయ పడుతున్నాను అంటూ కామెర్లు చేయడంతో ప్రతి ఒక్కరు కూడా రానా ని అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: