ఒకప్పుడు మాస్ సినిమాలకు పెట్టింది పేరు డైరెక్టర్ వి.వి.వినాయక్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకులు గా నిలిచారు . అయితే కొన్ని అపజయాలతో అనంతరం వివి వినాయక్ కెరియర్ సినిమాలకు దూరంగా ఉన్నారు. అగ్ర హీరోలకు ఈయన ఎన్నో సార్లు కథ చెప్పినప్పుడు కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈ మధ్యకాలంలో నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా అనే వార్తలు వినిపించాయి కానీ అది కూడా సెట్ కాలేదు. అయితే వినాయక్ ప్రస్తుతం నటన వైపు కూడా తన అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఇదివరకే ఈయన ఠాగూర్ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాలో కూడా నటించడం జరిగింది. ఇక దీపం లా నాయక్ సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో కనిపించిన వి.వి.వినాయక్ నటుడి గా తన కెరియర్ కొనసాగించాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అప్పట్లో దిల్ రాజు ప్రొడక్షన్లో నరసింహారెడ్డి డైరెక్టర్ తో వినాయక్ కొత్త సినిమా ప్రాజెక్టులను మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ స్క్రిప్టు మొత్తం సిద్ధమైన తర్వాత వి.వి.వినాయక్ ఫిట్నెస్ సమయంలో చాలా మార్పులు రావడం లేదు అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు.


అయితే ప్రాజెక్టు స్క్రిప్ట్ మధ్యలో మళ్ళీ కొంత చర్చ జరగడం తో ఎందుకు నమ్మకం కలగలేదు దిల్ రాజ్ సినిమా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక తర్వాత మళ్లీ వి.వి.వినాయక్ దర్శకత్వం వైపు అడుగులు వేశారు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో హిందీలో చత్రపతి సినిమాని రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ సగానికిపైగా పూర్తి అయినట్లుగా సమాచారం. ప్రస్తుతం వి.వి.వినాయక్ మరొక ప్రాజెక్టు పైన ఎక్కువగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఈయనతో సినిమా చేయడానికి దిల్ రాజు కూడా సిద్ధమైనట్లుగా సమాచారం. మరి ఈసారైనా వి.వి.వినాయక్ వెండితెరపై ఫుల్ పాత్రలో కనిపిస్తారని చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: