తెలుగు ఇండస్ట్రీ లోకి ఝుమ్మంది నాదం చిత్రంతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ తాప్సి.. ఆ తరువాత తెలుగులో వరుస సినిమాలో ఆఫర్లను దక్కించుకుంది కానీ సరైన సక్సెస్ అందుకోలేకపోవడంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది. అయితే అక్కడ పలు ఆఫర్లు రాణిస్తూనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదిస్తోంది. ప్రస్తుతం ఎక్కువగా లేడి ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ ఉన్నది. ఇక ఈమె నటించిన చిత్రాలు అన్ని మినిమం గ్యారంటీ అన్నట్లుగా ప్రేక్షకులలో ఒక భావం కలిగింది.. ఇమే నటించిన చిత్రాలు కూడా కొన్ని తెలుగులో డబ్ అయ్యి విడుదలయ్యాయి.


అలా మిషన్ ఇంపాజిబుల్, దోబారా వంటి చిత్రాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. అయితే ఈ సినిమా తాప్సీ ని చాలా హర్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రెస్ స్టేషన్ తోనే రిపోర్టర్ల పై మరొకసారి ఫైర్ అయినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఒక అవార్డు ఫంక్షన్ కి వచ్చిన తాప్సి అక్కడ మీడియాతో మాట్లాడడం జరిగింది ఈ క్రమంలోనే తాప్సి నటించిన దోబారా సినిమా రిలీజ్ కు ముందు జరిగిన నెగిటివ్ టాక్ గురించి రిపోర్టర్ ఆమెను ఒక ప్రశ్న వేశారు.


అందుకు తాప్సి ఏ సినిమాపై నెగిటివ్ జరగలేదు చెప్పండి అంటూ ఆ రిపోర్టర్కు ఎదురు ప్రశ్న వేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ రిపోర్టర్ తాప్సీ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక పోవడంతో అంతటితో ఆగకుండా తన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అంటు తాప్సి రిపోర్టర్ను నిలదీయడం జరిగినట్లు తెలుస్తోంది. మీరు చెప్పిన సమాధానాన్ని పట్టే నా సమాధానం ఉంటుంది అంటూ తెలియజేసింది తాప్సి. దీంతో చివరికి తాప్సి నన్ను ఒక ప్రశ్న అడిగాముందు మీరు ఎంతైనా తెలుసుకొని రండి అంటే చాలా ఘాటుగా స్పందించింది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: