టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన అక్కినేని అఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తనకెక్కుతున్న ఏజెంట్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మమ్ముట్టిమూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కొంత కాలం క్రితం ఈ మూవీ ని ఆగస్టు 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాక పోతే ఈ సినిమా షూటింగ్ అనుకున్న టైమ్ కి  అనుకున్నట్లుగా జరగకపోవడంతో ఈ మూవీ ని ఆగస్టు 12 వ తేదీన చిత్ర బృందం విడుదల చేయలేక పోయింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతున్న ఇప్పటికీ కూడా ఈ సినిమా విడుదల తేదీని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు.

నందమూరి నరసింహ బాలకృష్ణ 'అఖండ' లాంటి భారీ బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ;కి ఇప్పటి వరకు టైటిల్ ని కూడా ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 107 వ మూవీ గా తెరకెక్కుతుండడంతో ఈ మూవీ ని ఎన్ బి కె 107 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ లో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దునియా విజయ్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ విడుదల తేదీని కూడా ఇప్పటివరకు   చిత్ర బృందం ప్రకటించలేదు. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ లుగా తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాల విడుదల తేదీలను ఇప్పటివరకు అధికారికంగా చిత్ర బృందాలు  ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: