అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, నాగచైతన్య  ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా "మనం". ఈ సినిమాని బ్రిలియంట్ డైరెక్టర్  విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా అక్కినేని కుటుంబానికి ఒక మరపురాని చిత్రంగా మిగిలిపోయింది. అక్కినేని నాగేశ్వరరావు గారి చివరి చిత్రం కావడం ఈ సినిమా పట్ల అక్కినేని కుటుంబానికి ఒక ప్రత్యేక ఆపేక్ష.

 

ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులని నయనానందాన్ని కలిగించింది. అయితే ఈ సినిమా వచ్చి ఇప్పటికి ఐదేళ్ళు అవుతుంది. ఈ సుదీర్ఘ విరామం తర్వాత ఈ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందని సమాచారం. వివరాల్లోకి వెళితే , విక్రమ్ కె కుమార్ ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని తో "గ్యాంగ్ లీడర్ "సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.

 

ఈ సినిమా పూర్తయ్యాక తన తదుపరి చిత్రం నాగ్ తో ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. అంతేకాదు ఈ ఏడాది చివరలో ఈ సినిమా పట్టాలెక్కి 2020 ద్వితీయార్థంలో విడుదల చేయాలని భావిస్తున్నారట. అయితే నాగ్ ప్రస్తుతం "మన్మధుడు 2, బంగార్రాజు, బ్రహ్మాస్త్ర (హిందీ) సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో మన్మధుడు 2 ఆగస్టులో విడదల కానుంది.

 

ఇటీవల వచ్చిన ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మన్మధుడు 2 సినిమాకి  చి ల సౌ ఫేమ్ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. దాదాపు పదిహేడు సంవత్సరాల తర్వాత మన్మధుడు సినిమాకి సీక్వెల్ వస్తుంది. ఈ సినిమా విజయం సాధిస్తుందని అంచనాలు భారీగానే ఉన్నాయి.  మనం తర్వాత మరోసారి జట్టుకట్టే  నాగ్,విక్రమ్ కాంబినేషన్ ఎలాంటి చిత్రంతో పలకరిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: