అల్లు అర్జున్ కి దేవీశ్రీ ప్రసాద్ కు తెగడం లేదా..? తమన్ చేసిన పనికి బన్ని ఇపుడు దేవిశ్రీ ప్రసాద్ ను టార్చర్ చేస్తున్నాడా..? బ్లాక్ బస్టర్ ఇచ్చిన రాక్ స్టార్ మీద స్టైలీష్ స్టార్ డౌట్ పడుతున్నాడా.. ?ఇండస్ట్రీ సర్కిల్ లో ఇప్పుడు ఇదే టాక్ వినిపిస్తోంది.


అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో అదిరిపోయే బ్లాక్ బ్లస్టర్స్ వచ్చాయి. ఆర్య నుండి మొన్నటి డీజే సినిమా వరకు దేవిశ్రీ.. బన్ని సినిమాలకు గుర్తుండిపోయే ట్యూన్స్ ఇచ్చాడు. అంతేకాదు స్టైలీష్ స్టార్ సినిమాలకు రాక్ స్టార్ వెరీ స్పెషల్ ట్యూన్స్ ఇస్తుంటాడు. కానీ అలవైకుంఠపురంలో సాంగ్స్ ఊహించని సెన్సేషన్ క్రియేట్ చేయడంతో బన్ని, దేవిశ్రీప్రసాద్ పై ప్రెజర్ పెడుతున్నట్టు సమాచారం. 

 

అల వైకుంఠపురంలో సినిమాతో బన్ని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ లో పాటలకు సింహభాగం దక్కతోంది. అందుకే తర్వాత సుకుమార్ తో చేయబోతున్న సినిమా పాటల విషయంలోనూ బన్ని కేర్ తీసుకుంటున్నాడట. ఈ క్రమంలో అల్లు అర్జున్, దేవిశ్రీప్రసాద్ ఇచ్చే ట్యూన్స్ ని ఒకటికి పదిసార్లు చెక్ చేసి మరి ఒకే చేస్తున్నాడట. 


దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే మూడు అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడట. అయితే మిగతా మూడు పాటల విషయంలో మాత్రం బన్ని అసలు కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది. ట్యూన్స్ ఇవ్వడానికి కాస్త ఆలస్యమైనా అల వైకుంఠపురంలో రేంజ్ లో అదిరిపోయే ఆల్బం ఇవ్వాలని దేవిశ్రీ ప్రసాద్ కు చెప్పాడట. దీంతో ఎన్నో చార్ట్ బస్టర్స్ ఇచ్చిన దేవి టాలెంట్ మీదే బన్ని డౌట్ పడుతున్నాడా అంటూ నెటిజన్లు కొత్త అర్థాలు తీస్తున్నారు. అయినా దేవిశ్రీ నుండి ఎలాంటి ట్యూన్స్ పిండుకోవాలనేది దర్శకుడు సుకుమార్ కు బాగా తెలుసు. మొత్తానికి సాంగ్స్ విషయంలో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: