ఆంధ్రప్రదేశ్ లో అమరావతిని మార్చాలి అని నిర్ణయం తీసుకోవడం కొందరు నటులకు ఇబ్బందిగా మారింది. అమరావతి రాజధాని అని చెప్పిన సమయంలో కొందరు భూములను కొనుగోలు చేసారు. వెంకటపాలెం సహా ఆరు గ్రామాల్లో టాలీవుడ్ హీరోలకు భూములు ఉన్నాయి అనే ప్రచారం అప్పట్లో ఎక్కువగా జరిగింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని మార్చాలి అనే నిర్ణయం బయటకు రావడంతో చాలా మంది నటులు ఇబ్బంది పడ్డట్టు ప్రచారం జరుగుతుంది. తమ భూములకు ఏదైనా ఇబ్బంది వస్తుందా అనే భావనలో వాళ్ళు ఉన్నారు.

 

ముఖ్యంగా హీరోయిన్ అనుష్క అమరావతిలో భూములు కొనుగోలు చేసింది. ఆమెకు సంబంధించిన భూములు ఇప్పుడు ధరలు కూడా తగ్గాయి. అమరావతిలో దాదాపు ఆరు నెలల కాలంలో రియల్ ఎస్టేట్ భారీగా పడిపోయింది. ప్రస్తుతం ఆ భూములను అమ్మాలా ఉంచుకోవాలో అర్ధం కాని స్థితిలో ఆమె ఉన్నారు. అయితే ఇక్కడ అనుష్కకు ఒక ఇబ్బంది వచ్చి పడింది. ఆ భూములను ఇప్పుడు పట్టా భూములుగా ప్రభుత్వం పేదలకు పంచుతుంది. త్వరలో ఈ కార్యక్రమం మొదలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. 

 

దీనితో తన భూములను ఏమైనా పంచేస్తున్నారా అనే భయం ఆమెలో మొదలయింది. ఆమె విషయం తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయగా తన భూమిలో రెండు ఎకరాలు కూడా ప్రభుత్వం పట్టాలు ఇవ్వడానికి ఎంపిక చేసింది అనే విషయం ఆమె దృష్టికి వచ్చింది. దీనితో తన సన్నిహిత మిత్రుల ద్వారా ఏపీ మంత్రిని ఒకరిని తెలంగాణా మంత్రి సహాయంతో ఆమె హైదరాబాద్ లో కలిసింది. ఈ సందర్భంగా తన భూముల గురించి చెప్పింది. దీనితో స్పందించిన సదరు మంత్రిగారు మీ భూములకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, వాటిని అమ్మే ఆలోచన గాని, అవి పోతాయి అనే భయం గాని పెట్టుకోవద్దని సదరు మంత్రి గారు ఆమెకు సూచించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: