ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అక్కినేని నాగచైతన్య సినిమాలపై టాలీవుడ్లో కాస్త కన్ఫ్యూజన్ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే మహేష్ బాబు 27వ సినిమా ఎవరితో ఉండబోతోంది అనే విషయం త్వరలో కన్ఫామ్ కానున్నప్పటికీ  28వ సినిమా మాత్రం గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో ఉండబోతుంది అని ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. ఇది దాదాపుగా కన్ఫామ్ అయిపోయినట్లే అని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది. అయితే చైతు పరశురామ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కాల్సి  ఉండగా మహేష్ బాబు సినిమా ఆఫర్ రావడంతో చైతు తో  సినిమాను కాస్త డిలే  చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే... అటు నాగచైతన్య కూడా సైలెంట్ గా నెక్స్ట్ సినిమా కన్ఫామ్ చేసుకునే పనిలో పడ్డట్లు సమాచారం. 

 

 

 

 ఓ బేబీ లాంటి సినిమాలను తెరకెక్కించి మంచి విజయం జోష్ లో ఉన్న దర్శకురాలు నందిని రెడ్డి తో ఓ సినిమా చేయనున్నాడట నాగ చైతన్య. ఈ మధ్య చైతూ కోసం సమంతకి ఓ పాయింట్ వినిపించిన నందిని రెడ్డి... ఆ తర్వాత ఈ స్క్రిప్టుని నాగచైతన్య దగ్గర నరేట్ చేసి గ్రీన్ సిగ్నల్ అందుకుందట. అయితే నందినిరెడ్డి నాగచైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా స్వప్న సినిమాస్ బ్యానర్లో నిర్మించబోతున్నారు అని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తిచేసి త్వరలో పట్టా లెక్కించేందుకు సిద్ధమవుతున్నారట దర్శకురాలు నందిని రెడ్డి. 

 

 

 ఈ నేపథ్యంలో ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాలో నటిస్తున్న నాగచైతన్యసినిమా పూర్తవ్వగానే నందిని రెడ్డి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో ఉన్నాడట. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ప్లాన్ లో వచ్చిన మార్పుతో తన సినిమా ఎలాగూ డిలే అవుతుందని ముందుగానే గ్రహించిన అక్కినేని నాగచైతన్య నందిని రెడ్డి ని లైన్ లో పెట్టేసుకుని మరో ఈ సినిమాతో పట్టాలెక్క పోతున్నాడు. మరి గతంలో ఓ బేబీ లాంటి రీమేక్ సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్న నందినిరెడ్డి...మరోసారి  ఈ అక్కినేని హీరోతో మళ్లీ ఏదైనా రీమేక్ సినిమానే తీస్తుంద లేదా సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: