లాక్ డౌన్ కారణంగా గత నెల రోజుల నుండి సినిమా షూటింగ్ లు మొత్తం ఆగిపోవటం జరిగాయి. దీంతో ఇంటికే పరిమితమైన సెలబ్రెటీలు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. ఎక్కడా కూడా అడుగు తీసి అడుగు బయటకు వేయలేని పరిస్థితి కావటంతో ఇంట్లోనే ఉంటూ అనేక విషయాలు మీడియాతో పంచుకుంటున్నారు. తాజాగా ఇటీవల భారత దేశ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇంట్లో ఉండి వీడియో కాల్ లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అనేక విషయాల గురించి రాజమౌళి చెప్పుకొచ్చారు. ప్రజెంట్ చేస్తున్న 'RRR' గురించి అదేవిధంగా నెక్స్ట్ మహేష్ బాబు తో సినిమా చేస్తున్నట్లు ఇలా రకరకాల విషయాలు ఇంటర్వ్యూలో చెప్పటం జరిగింది.
ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారి ఇంగ్లిషేతర సినిమా సౌత్ కొరియన్ మూవీ 'పారసైట్' కి బెస్ట్ పిక్చర్ ఆస్కార్ అవార్డు రావడం అందరికి తెలిసిందే. అమెరికాలో చాలామంది సినిమా ప్రేక్షకులు పారసైట్ నీ ఆదరించారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యి మంచి పేరు సంపాదించుకుంది. అలాంటిది ఈ సినిమా చూసిన టైములో తనకు నచ్చలేదని… సినిమా చూస్తూ ఉండగానే నిద్ర వచ్చేసి మధ్యలోనే పడుకుండిపోయాను అని తెలిపటం జరిగింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో నెటిజన్లు విని అందరూ షాక్ తిన్నారు. అదేంటి ప్రపంచం మొత్తం మెచ్చిన 'పారసైట్' సినిమా రాజమౌళికి నచ్చకపోవడం ఏంటి అని అందరూ అంటున్నారు. దీంతో కొంతమంది అభిమానులు ఈ విషయం సీరియస్ గా తీసుకున్నీ రాజమౌళి ఐనా ఆయనకంటూ టేస్ట్ ఉండదా ఆయన కూడా మనిషే కదా అని అంటున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple.