టాలీవుడ్ లో మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆయన సినిమా వస్తుంది అంటే చాలా మంది ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన ప్రతీ సినిమా విషయంలో ఇప్పుడు జాగ్రత్తలు తీసుకునే చేస్తూ వస్తున్నారు. ఆయన సినిమాల విషయంలో ఈ మధ్య దర్శకులు కమర్షియల్ కోణాన్ని ఎక్కువగా చూసి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పక్కన పెడితే ఇప్పుడు మహేష్ పూర్తి స్థాయిలో నిర్మాతగా మారే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని... ఆయన ఇప్పుడు బాలీవుడ్ సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారని సమాచారం. 

 

బాలీవుడ్ సినిమాల విషయంలో ఇప్పుడు ఆయన ఆసక్తి చూపిస్తున్నాడు అని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినపడుతున్నాయి. దీనికి కారణం ఏంటీ అంటే ఇప్పుడు తన సినిమాను ఒక బాలీవుడ్ నిర్మాత నిర్మిస్తా అని మాట ఇచ్చారని అందుకే మహేష్ బాబు ఇప్పుడు అక్కడ ఒక సినిమాలో కొంత వరకు పెట్టుబడి పెడుతున్నారని అంటున్నారు. ప్రస్తుత౦ మహేష్ సినిమాల విషయంలో బాలీవుడ్ నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన సినిమాలకు అక్కడ ప్రత్యేక ఆదరణ ఉంది. 

 

కాని వసూళ్లు మాత్రం పెద్దగా వచ్చే అవకాశం ఉండదు. మహేష్ అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ బాలీవుడ్ లో సినిమాను హీరోగా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. తన సినిమాను సదరు నిర్మాత ప్రమోట్ చేస్తాను అని చెప్పారు ఆ సినిమాను తాను ఇక్కడ ప్రమోట్ చేస్తాను అని మాట ఇచ్చారట. త్వరలోనే మహేష్ బాబు తన సినిమాను బాలీవుడ్ కి తీసుకుని వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెల మొదలు కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: