జూనియర్ ఎన్టీయార్ టాలీవుడ్లో టాప్ స్టార్ గా ఉన్నాడు. వరస హిట్లతో సూపర్ స్టార్ డంని కొనసాగిస్తున్నాదు. ఆర్.ఆర్.ఆర్ హిట్ కావాలి కానీ బాలీవుడ్ ని కూడా షేక్ చేసే స్టామినా సొంతం చేసుకోబడతాడు, ఇక జూనియర్ ఆర్.ఆర్.ఆర్ తరువాత మూవీని కూడా లైన్లో పెట్టాడు.
ఆ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ డైరెక్షన్లో డిజైన్ చేస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీయార్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తాడని టాక్ అపుడే బయటకు వచ్చేసింది. ఇందులో మెయిన్ లీడ్ ఫిమేల్ రోల్ కి శ్రీదేవి కూతురు జాహ్నవీ కపూర్ ని తీసుకోవాలనుకుంటున్నట్లుగా టాక్.
ఇప్పటికే టాలీవుడ్లోకి శ్రీదేవి కూతురు ఎంట్రీ కోసం ఎన్నో సార్లు ఎందరో ట్రై చేశారు.మెగాస్టార్ వారసుడు రాం చరణ్ పక్కన జాహ్నవీ కపూర్ జగదేక వీరుడు అతిలోక్ సుందరి మూవీ చేస్తుందని అనుకున్నారు. అయితే అది ముందుకు కదిలేలా ఇప్పట్లోలేదు. ఇక జాన్వీ కి తెలుగులో విజయ్ దేవరకొండ యాక్షన్ ఇష్టమని చెప్పుకుంది. దాంతో ఆమెను తెచ్చి దేవరకొండ సినిమా ఫైటర్ లో పెట్టాలని, జోడీ కట్టించాలని పూరీ ట్రై చేసినట్లుగా న్యూస్ స్ప్రెడ్ అయింది.
ఇపుడు అదీ ఇదీ కాకుండా ఏకంగా నందమూరి అందగాడి పక్కనే నటించేందుకు జాన్వీని ఫిక్స్ చేస్తున్నారన్న వార్త జూనియర్ ఫ్యాన్స్ కి కిక్కు ఎక్కిస్తోంది. ఈ సినిమాలో రెండవ హీరో పక్కన పూజా హెగ్డేని ఫిక్స్ చేశారట. ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగు పూర్తికాగానే ఈ మూవీ సెట్స్ మీదకు వస్తుందట. వచ్చే ఏడాది దసరాకు ఈ మూవీ రిలీజ్ అంటున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా జాన్వీ జూనియర్ కాంబో అంటే ఆకుచాటు పిందె తడిసే అంటూ వాళ్ల తాతగారు, వీళ్ళ అమ్మ గారు కలసి నటించిన ఫుల్లీ రొమాంటిక్ రైన్ సాంగ్ గుర్తుకురాక మానదు.