ఈ మూవీ ఇప్పటికే థియేటర్లలో సందడి చేయాల్సి ఉండగా కరోనా వైరస్ వలన వాయిదా పడింది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ మొదటి పార్ట్ భారీ విజయం సాధించడంతో ‘కేజీఎఫ్-2’పై అంచనాలు పెరిగాయి. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ‘బాహుబలి’ సీరిసు మాదిరిగానే ‘కేజీఎఫ్’ కూడా విజయం సాధిస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పుడు కొన్ని సినిమాలు ఓ టి టి లోనే విడుదలవుతున్నాయి. అదేవిధంగా కే జి ఎఫ్ చాప్టర్ 2 కి కూడా ఓ టి టి భారీ ఆఫర్ ఇచ్చినా చిత్ర బృందం తిరస్కరించి, ఎలాగైనా థియేటర్లోనే విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
కే జి ఎఫ్ చాప్టర్ 2 మొదటి పార్ట్ కంటే భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు ఒళ్ళు గగొర్పొడిచేలా ఉంటాయట.. ఈ క్రమంలోనే సినిమాలో భారీ క్లైమాక్స్ కు ప్లాన్ చేసినట్టు తెలిసింది.ఈ సినిమా హీరో యశ్ తోపాటు బాలీవుడ్ హీరో.. ఈ సినిమాలో విలన్ గా చేస్తున్న సంజయ్ దత్ ల మధ్య భీకర పోరాట సన్నివేశాన్ని క్లైమాక్స్ లో ప్లాన్ చేశారట.. ఈ క్లైమాక్స్ ను హైదరాబాద్ లో తెరకెక్కించుకున్నారని సమాచారం. ఇటీవలే హైదరాబాద్ కు యష్ చేరుకున్నారు. అలాగే సంజయ్ దత్ కూడా రాబోతున్నారట.. భారీ క్లైమాక్స్ ను నవంబర్ మొదటి వారం నుంచి తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్ సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి అతి త్వరలోనే ఈ సినిమా విడుదలయ్యి చిత్రబృందానికి మంచి లాభాలు రావాలని ఆశిద్దాం.