టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చిరూ పేరుకే సీనియర్ హీరో. కానీ ఆయన సినిమాల ఎంపిక విషయంలో మాత్రం యువ హీరోలకు దీటుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా నరసింహా రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. దాదాపు 30 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఇక మెగా హీరో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్ర లో నటిస్తున్నాడు.

 అయితే ఇటీవల కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభం అయింది.ఇదిలా ఉంటే ఈ మధ్యనే అల్లు వారి ఫ్యామిలీ అంతా కలిసి సినిమా రంగంలో నూతన ఉత్సాహాన్ని ప్రోత్సహించడం కోసం అల్లు స్టూడియోని నిర్మించబోతున్న సంగతి తెలిసిందే..  అయితే ఇప్పుడు ఇదే బాటలో మెగాస్టార్ కూడా అడుగులు వేస్తున్నట్లు ఇండ్రస్టీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు  మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఓ బ్రహ్మండమైన స్టూడియోను నిర్మించబోతున్నారనే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో ఆయనకు ఉన్న పదెకరాల స్థలంలో స్టూడియోను ప్రారంభించనున్నారు. ఇందులో నాలుగు ఫ్లోర్లు, కాటేజీలు కూడా నిర్మిస్తారని అంటున్నారు.

 ఇండోర్ షూటింగ్స్, టీవీ సీరియల్స్, రియాలిటీ షోస్, మినీ ఈవెంట్స్.. జరపుకునే వీలుగా ఈ స్టూడియో నిర్మాణానికి ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.అంతేకాదు ఈ స్టూడియో పూర్తి బాధ్యతలు చిరంజీవి దగ్గరుండి మరీ చూసుకుంటారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే అక్కినేని కుటుంబం నుంచి అన్నపూర్ణ స్టూడియోస్, దగ్గుబాటి కుటుంబం నుంచి రామానాయుడు స్టూడియోస్ లు మంచి ఆదరణను కలిగి ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ అల్లు మరియు మెగా స్టూడియోలు ముందు ముందు ఇంతటి ఆదరణను కనబరుస్తాయో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: