బిగ్ బాస్ సీజన్ 4లో ఎలిమినేట్ అవుతున్న హౌజ్ మేట్స్ విషయనంలో ఏదో మతలబు జరుగుతుందని ఆడియెన్స్ టాక్. హౌజ్ లో ఆట ఆడే వారికన్నా పులిహోర కలిపే వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని. కొందరికి స్క్రీన్ స్పేస్ ఇవ్వట్లేదని అంటున్నారు. అంతేకాదు నామినేట్ అయిన హౌజ్ మేట్స్ ఎలిమినేట్ చేసే ప్రాసెస్ లో వచ్చిన ఓటింగ్స్ ప్రకారం కాకుండా వారికి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారని టాక్. బిగ్ బాస్ ప్రతి సీజన్ లో ఇలాంటి కామెంట్స్ కామనే కాకపోతే ఈ సీజన్ లో ముగ్గురు హౌజ్ మేట్స్ ఎలిమినేషన్ రాంగ్ గా జరిగిందని అంటున్నారు.

దేవి నాగవల్లి విషయంలో మెహబూబ్ ను కాపాడి ఆమెను ఎలిమినేట్ చేశారని టాక్ వచ్చింది. ఇక మోనాల్ ను సేవ్ చేసి  కుమార్ సాయిని ఎలిమినేట్ చేశారని అన్నారు. ఫైనల్ గా లాస్ట్ సండే కూడా మోనాల్ వెళ్తుంది అనుకుంటే దివిని ఎలిమినేట్ చేశారు. మరి ఇలా ఓటింగ్స్ ప్రకారం కాకుండా వారికి ఇష్టం వచ్చినట్టుగా ఎలిమినేట్ చేయడం ఏమాత్రం బాగాలేదు. ఆడియెన్స్ కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు.

ప్రతి బిగ్ బాస్ సీజన్ లో ఇలాంటివి కామన్ గా జరుగుతుంటాయి. కాని బిగ్ బాస్ వారు చెప్పేది ఏంటంటే తాము ఓటింగ్స్ ప్రకారంగానే ఎలిమినేట్ చేస్తామని.. ఇందులో ఎలాంటి కన్ ఫ్యూజన్ లేదని అంటుంటారు. సో ఎలిమినేషన్ ప్రాసెస్ పై వస్తున్న వార్తలన్ని తిప్పికొట్టేలా బిగ్ బాస్ టీం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. 8వ వారం కూడా హౌజ్ నుండి ఆరుగురు హౌజ్ మేట్స్ నామినేషన్స్ లో ఉన్నారు.                                              

మరింత సమాచారం తెలుసుకోండి: