ఇప్పుడు వస్తున్నా హీరోయిన్స్ లో తాము వేసే పాత్ర కోసం ఎంత చేయాలో అంత  చేస్తున్నారు . సినిమా బాగా రావడానికి చాలా కష్ట పడుతున్నారు అందులో కొందరు హీరోయిన్స్  చాలా సున్నిత మనస్కులై వుంటారు . వాళ్ళని  చిన్నగా ఎమన్నా అస్సలు పడటం . ఇదే దర్శకుడికి మరియు హీరోయిన్స్ తో వచ్చే పెద్ద  చిక్కు  మరియు హీరోయిన్స్   చిన్న మాట అంటే వాళ్ళు ఫీల్ అయి పోవడం సరిగా మాటని తీసుకోక పోవడం కారణంగా ఒక్కోసారి సినిమా షూటింగ్ ని వారికోసం నిలిపి వేయవలసి వస్తుంది . అలాంటి సంఘటనే హీరోయిన్ రంభ కి  మరియు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు  గారి మధ్య చోటుచేసుకుంది .. ఆ ఘటన ఏంటో చూద్దామా ...

తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో కె.రాఘవేంద్రరావు ఒకరు. హీరోయిన్లనూ అందంగా చూపించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అని ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతుంటారు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆయన షూటింగ్‌ లొకేషన్లలోనూ అంతే సరదాగా ఉండేవారట. కానీ ఓ సందర్భంలో హీరోయిన్ రంభ‌పై కోపం తెచుకున్నారట దర్శకేంద్రుడు. జేడీ చక్రవర్తి, రంభ జంటగా  బొంబాయి ప్రియుడు సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే ఈ చిత్రంలోని గుప్పెడు గుండెను తడితే పాట లో భాగంగా . హీరో రంభ నడుముపై బత్తాయిలు వేస్తుంటాడు. పాట షూటింగ్ గ్యాప్‌లో అందరూ కలిసి కూర్చుని ఉన్న సమయంలో.. డైరెక్టర్‌ గారు   నీమీద పుచ్చకాయలు వేయిస్తారు అని చెప్పడంతో రంభ గట్టిగా నవ్విందట . దీంతో చిరాకు పడ్డ రాఘవేంద్రరావు మీరు నవ్వడం అయ్యాక  చెప్పండి నేనొచ్చి షాట్‌ తీస్తా అని రంభ పై  కోపగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారట.

రాఘవేంద్రరావు అలా అనేసరికి రంభ బోరున ఏడ్చేశారట. ఎవరు ఎంత నచ్చజెప్పినా ఆమె ఏడుపు ఆపకపోవడంతో ఈ రోజు పాటకు ప్యాకప్ చెప్పేసి... మరుసటి రోజు షూటింగ్ కొనసాగించారు. షాట్‌లో నా తప్పు లేకుండా నన్ను అంటే నాకు కోపం వస్తుంది. నేను చాలా సెన్సిటివ్’ అని ఓ సందర్భంగా రంభ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: