వరుసగా నాలుగు సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి తరువాతి సినిమా కి ముహూర్తం కుదిరింది..టాలీవుడ్ లో కామెడీ తో కమర్షియల్ చిత్రాలు చేసే దర్శకులు చాల తక్కువ అని చెప్పాలి.. ఇలా చేయాలంటే చాలా గట్స్ ఉండాలి.. ఎందుకంటే అటు హీరో ఇమేజ్ ను, ఇటు సినిమా కథకు జోడించి కామెడీ గా సినిమా ను కమర్షియల్ గా తెరకెక్కించాలంటే చాలా టెక్నీక్, సంయమనం ఉండాలి.. అలా టాలీవుడ్ కి దొరికిన అతి కొద్దీ మంది దర్శకుల్లో ఒకరు అనిల్ రావిపూడి.. తొలి సినిమా పటాస్ తో టాలీవుడ్ ని తనవైపు తిప్పుకున్న అనిల్ రావిపూడి ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. వరుస హిట్లతో దూసుకుపోయాడు..

రాజా ది గ్రేట్, f2 , సరిలేరు నీకెవ్వరూ వంటి చిత్రాలతో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా పెద్ద పెద్ద హీరోలతో సినిమా చేసే సత్తా తనలో ఉందని చెప్పకనే చెప్పాడు.. అయితే మహేష్ బాబు తో సూపర్ హిట్ సినిమా ని చేసి ఇప్పటివరకు ఏ హీరో తో సినిమా అనౌన్సు చేయకపోవడంతో అనిల్ రావిపూడి ఫాన్స్ కొంత నిరాశ లో ఉన్నట్లు తెలుస్తుంది. తొలుత అనిల్ సాయి పల్లవి తో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి.. యా తర్వాత నాగార్జున తో సినిమా అని గాసిప్స్ వచ్చాయి.. కానీ తాజా సమాచారం ప్రకారం అనిల్  F3 మీద వర్క్ చేస్తున్నాడని తెలుస్తుంది..సరిలేరు తర్వాత అనిల్ చేయబోయే  సినిమా ఇదే అని తెలుస్తుంది.

వాస్తవానికి వచ్చే ఏడాది సంక్రాంతికి ఎఫ్ 3 సినిమాను విడుదల చేయాలనుకున్నాడు.న్న దర్శకుడు అనీల్ రావిపూడి వచ్చే ఏడాది సంక్రాంతికి ఎఫ్ 3 సినిమాను విడుదల చేయాలనుకున్నాడు. కాని కరోనా కారణంగా సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టలేక పోయాడు. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయ్యింది. అయితే వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ ఇతర సినిమాలతో వేరు వేరుగా బిజీగా ఉన్న కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతుంది. మొన్నటి వరకు డిసెంబర్ లో షూటింగ్ మొదలు పెట్టాలని దర్శకుడు అనీల్ రావిపూడి కోరుకున్నాడు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ను వచ్చే ఏడాది సంక్రాంతికి పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: