ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు కొంత విరామం ఇచ్చి  వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ షూటింగులో పాల్గొంటున్న  పవర్ స్టార్  క్రిష్‌తో చేయబోయే సినిమా కోసం రెడీ అవుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్సినిమా కోసం సరికొత్త లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మొగలాయిల కాలం నాటి కథతో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ బందిపోటుగా కనిపించనున్నట్లు టాక్. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు నటించడానికి స్కోప్ ఉండటంతో మొదటి హీరోయిన్‌గా బాలీవుడ్ హాట్ బ్యూటీ  జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌‌ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె కన్ఫార్మ్ చేసింది.మరో హీరోయిన్‌ కోసం యూనిట్‌ ఇస్మార్ట్ హాట్ బ్యూటీ  నిధి అగర్వాల్ ని తీసుకోబోతున్నట్లు ప్రచారం బయటికి వచ్చింది.ఇక  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సౌత్ ఇండియా సెన్సేషన్ బ్యూటీ  సాయిపల్లవి ఈ సినిమాలో తీసుకోబోతున్నట్లు దాదాపు కన్ఫామ్ అయినట్లు చిత్ర బృందం నుంచి సమాచారం అందుతుంది..


ఇక ఈ సినిమాలో జమీందారీ కుటుంబానికి చెందిన యువతి పాత్ర సినిమాకే హైలెట్ గా  నిలుస్తుందట. అందువల్ల ఈ పాత్రకి సాయిపల్లవి అయితే చాలా బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ సినిమాలో ఈ పాత్ర పోషించడానికి  సాయిపల్లవి ఓకే చెప్పేసిందంటూ సోషల్‌మీడియా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.ఇక ఈ సినిమా తరువాత పవర్ స్టార్ మలయాళం సినిమా"అయ్యప్పనం కోషియం " రీమేక్ లోను అలాగే సురేందర్ రెడ్డీ తో ఓ సినిమా అలాగే తనకు గబ్బర్ సింగ్ లాంటి కం బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మాస్ డైరెక్టర్  హరీష్ శంకర్ తో ఓ సినిమా చేస్తున్నాడని సమాచారం.ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: