టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ అయన సినిమాలు బాక్సాఫిస్ వద్ద బోల్తాపడుతూనే ఉన్నాయి. అయితే అవి తక్కువ బడ్జెట్ సినిమాలు కావడంతో అవి పెద్దగా ఎఫెక్ట్ అవట్లేదు. అప్పుడెప్పుడో దిక్కులు చూడకు రామయ్య , మొన్న చేసిన ఛలో తర్వాత నాగశౌర్య కి తెలుగులో పెద్ద హిట్ లు లేవని చెప్పాలి. ఊహలు గుసగుస లాడే చిత్రంతో టాలీవుడ్ లో పూర్తి స్థాయి హీరో గా పరిచయమైనా నాగశౌర్య దిక్కులు చూడకు రామయ్య తో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు సొంతం చేసుకున్నాడు. కానీ ఆ హిట్లను ఉపయోగించుకోలేక పోయాడు..

సినిమా లతో వచ్చినా స్టార్ డం కాస్త ఆ తర్వాత వొచ్చిన అరడజను సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. మళ్ళీ ఛలో తో ట్రాక్ లో పడ్డాడు అనుకున్నా కథ ప్రాధాన్యం లేని సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నాడు..   సొంత బ్యానర్ కూడా పెట్టి తన సినిమా లు తానే చేయడం మొదలుపెట్టాడు.. అయినా ఈ హీరోకి కి లక్ కలిసి రావట్లేదు.. సీరియస్ సబ్జెక్టు లు చేసినా నాగ శౌర్య కి హిట్ పడట్లేదు. దాంతో ఈ సారి మరో యాక్షన్ సబ్జెక్టు తో వస్తున్నట్లు తెలుస్తుంది.

సంతోష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం లో నాగ శౌర్యసినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. నాగ‌శౌర్య 20వ చిత్ర‌మిది. ఇందులో శౌర్య ఓ విలుకారుడిగా క‌నిపించ‌నున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో న‌డిచే క‌థ ఇది. ఇందుకోసం నాగ‌శౌర్య‌… త‌న శ‌రీరాకృతి కూడా మార్చుకున్నాడు. ఈసినిమా టైటిల్  పై కొంత చర్చ జరగగా లక్ష్య అనే టైటిల్ ని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. అశ్వద్ధామ సినిమా తో పర్వాలేదనిపించుకున్న నాగ శౌర్య లక్ష్య తో అయినా హిట్ లక్ష్యాన్ని చేరుకుంటాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: