ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా లో హీరోయిన్ గా దీపికా పడుకునే ని ఖరారు చేయగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్ రెడీ గా ఉంది.. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా అమితాబ్ కూడా నటిస్తున్నట్లు ఇటీవలే సినిమా టీం నుండి అధికారిక ప్రకటన వచ్చేసింది..
‘బాహుబలి’తో ఒక్కసారిగా అనూహ్యమైన క్రేజ్ సంపాదించుకుని పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్. అందుకే ప్రభాస్ మరో పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ కూడా చేస్తున్నాడు. ఈ సినిమా తో పాటు మరో పాన్ ఇండియా సినిమా సలార్ కూడా తోడయ్యింది. అయితే ఈ సినిమా ఒప్పుకోవడానికి ఓ కారణం ఉందట..ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఉగ్రమ్' మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఇదే స్టోరీ లైన్ ని ప్రభాస్ కి చెప్పి ఒప్పించాడని తెలుస్తోంది. ఆల్రెడీ ప్రశాంత్ తీసిన సినిమానే కావడంతో ఈ సినిమా పై పూర్తి అవగాహన ఉంటుంది. స్క్రిప్ట్ కూడా రెడీగా ఉండటంతో చిత్రీకరణకు కూడా ఎక్కువ సమయం పట్టదు. ప్రస్తుతం ఉన్న బిజీలో తక్కువ కాల్షీట్స్ లోనే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చని భావించిన ప్రభాస్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది.