నేడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ ల సలార్ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే.. ఇప్పటికే రాధే శ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలను ఒప్పుకుని ఫుల్ బిజీ గా ఉన్న ప్రభాస్ ఇప్పుడు సలార్ సినిమా చేయడం విశేషం.. చూడబోతే ఈ నాలుగు సినిమాలు ప్రభాస్ కెరీర్ ని ఎక్కడికో తీసుకుపోతాయని చెప్పొచ్చు. రాధే శ్యామ్ తప్పా మిగితా సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే..ఒక్కోటి ఒక్కో స్పెషల్ ఉన్న సినిమా.. ఇందులో రాధే శ్యామ్ సినిమా ముందుగా రిలీజ్ అవుతుండగా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. వేసవి కానీ వచ్చే దసరా కి కానీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా లో హీరోయిన్ గా దీపికా పడుకునే ని ఖరారు చేయగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్ రెడీ గా ఉంది.. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా అమితాబ్ కూడా నటిస్తున్నట్లు ఇటీవలే సినిమా టీం నుండి అధికారిక ప్రకటన వచ్చేసింది..

‘బాహుబలి’తో ఒక్కసారిగా అనూహ్యమైన క్రేజ్ సంపాదించుకుని పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్. అందుకే ప్రభాస్ మరో పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ కూడా చేస్తున్నాడు. ఈ సినిమా తో పాటు మరో పాన్ ఇండియా సినిమా సలార్ కూడా తోడయ్యింది. అయితే ఈ సినిమా ఒప్పుకోవడానికి ఓ కారణం ఉందట..ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఉగ్రమ్' మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఇదే స్టోరీ లైన్ ని ప్రభాస్ కి చెప్పి ఒప్పించాడని తెలుస్తోంది. ఆల్రెడీ ప్రశాంత్ తీసిన సినిమానే కావడంతో ఈ సినిమా పై పూర్తి అవగాహన ఉంటుంది. స్క్రిప్ట్ కూడా రెడీగా ఉండటంతో చిత్రీకరణకు కూడా ఎక్కువ సమయం పట్టదు. ప్రస్తుతం ఉన్న బిజీలో తక్కువ కాల్షీట్స్ లోనే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చని భావించిన ప్రభాస్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: