రవితేజ తో క్రాక్ సినిమా తెరకెక్కించిన గోపీచంద్ మలినేని ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. నిజానికి క్రాక్ అనేది రొటీన్ సినిమానే అయినా చాలా కాలం తర్వాత థియేటర్లలో సినిమా రావడం అలాగే రవితేజ మార్క్ హీరోయిజం, తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా ఒకటి కాదు అన్ని విషయాలు సినిమాకి కలిసి రావడంతో సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేనికి వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. కానీ కరాక్ సినిమా ఒప్పుకోవడానికి ముందే గోపీచంద్ మలినేని మైత్రి మూవీ మేకర్స్ వారికి ఓ సినిమా చేయాల్సి ఉంది. 

ఇప్పుడు ఆ సినిమా చేయమని మైత్రీ వలలు కోరినట్లు చెబుతున్నారు. నిజానికి బాలకృష్ణసినిమా చేయాలని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తూ వస్తోంది. కానీ ఎప్పటికప్పుడు సినిమా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇప్పుడు గోపీచంద్ తో బాలకృష్ణకు ఒక కథను సిద్ధం చేయమని మైత్రి మూవీ మేకర్స్ కోరినట్లు చెబుతున్నారు. అయితే దీని కోసం గోపీచంద్ కథ సిద్ధం చేసి మైత్రి మూవీ మేకర్స్ వారికీ కధ చెప్పగా ఆ కథ వారికి నచ్చిందని అంటున్నారు. 

దీంతో బాలయ్యకి కథ చెప్పమని కూడా గోపీచంద్ ని కోరారట. అయితే క్రాక్ సినిమాని ఇంకా బాలయ్య చూడ లేదట. చూశాక గోపీచంద్ కి ఆయన కబురు పెట్టె అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి బాలకృష్ణకు సినిమా కధ కంటే దర్శకుడు, ఆయన మాట తీరు నచ్చడం ముఖ్యం. గోపీచంద్ మలినేనితో కచ్చితంగా ఒక మంచి బాండ్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. దీంతో బాలకృష్ణతో గోపీచంద్ సినిమా ఫిక్స్ అయిపోయినట్లే అని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: