నితిన్ బృందం ఏకంగా రెండు నెలలకు పైగా రిలీజ్ ని వాయిదా వేసేసింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద యూత్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఇప్పటికే మంచి పబ్లిసిటీ కూడా వచ్చేసింది. ఈ సినిమా తర్వాత నితిన్ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ హిట్ అయిన 'అంధాధూన్' రీమేక్ లో నటిస్తున్నారు.. సినిమా లో హీరో ఒక బ్లైండ్ కాగా ఈ పాత్రకు నితిన్ ఒప్పుకోవడం పెద్ద రిస్క్ అయితే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను తమన్నా ఒప్పుకోవడం ఇంకా పెద్ద రిస్క్.. కథ ప్రాధాన్యం ఉన్న సినిమా కావడంతో తమన్నా ఈ సినిమా కి ఒప్పుకుందని అంటున్నారు...
ఈ సినిమా తో పాటు నితిన్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. మొత్తానికి 2021లో నితిన్ నుంచి మూడు సినిమాలొస్తాయన్నమాట. `అంధాధూన్` తరవాత నితిన్ చేయబోయే సినిమా ఖరారైపోయింది. కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. గీత రచయితగా తన ప్రయాణం మొదలెట్టారు కృష్ణ చైతన్య. నారా రోహిత్ తో `రౌడీ ఫెలో` తెరకెక్కించాడు. ఆ తరవాత.. నితిన్ తో `ఛల్ మోహనరంగ` తీశాడు. `ఛల్ మోహనరంగ` ఫ్లాపయ్యింది. ఆ తరవాత.. కృష్ణ చైతన్య పూర్తిగా పాటలపైనే దృష్టి పెట్టాడు. ఇప్పుడు నితిన్ తనకు మరో ఛాన్స్ ఇచ్చాడు. దీనికి `పవర్ పేట` అనే టైటిల్ ప్రచారంలో ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దర్శకుడిగా కృష్ణ చైతన్యని ఎంచుకున్నారు. మే నుంచి ఈ సినిమా పట్టాలెక్కొచ్చు.