భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్ ప్రస్తుతం రంగ్ దే సినిమా చేస్తున్నాడు.. వెంకీ అట్లూరి ఈ సినిమా కి దర్శకుడు కాగా ఈ సినిమా తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు..   న్యూ ఇయర్ సందర్భంగా నితిన్ రంగ్ దే టీమ్ కొత్త విడుదల తేదీని ప్రకటించింది. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు అఫీషియల్ గా చెప్పేసింది. నిజానికి నెలల క్రితమే సంక్రాంతికి తమ సినిమా వస్తుందని చెప్పింది రంగ్ దేనే. ఆ తర్వాత మిగిలినవాళ్లు ఒక్కొక్కరుగా అనౌన్స్ మెంట్లు చేశారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.

నితిన్ బృందం ఏకంగా రెండు నెలలకు పైగా రిలీజ్ ని వాయిదా వేసేసింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద యూత్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఇప్పటికే మంచి పబ్లిసిటీ కూడా వచ్చేసింది. ఈ సినిమా తర్వాత నితిన్ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ హిట్ అయిన 'అంధాధూన్' రీమేక్ లో నటిస్తున్నారు..  సినిమా లో హీరో ఒక బ్లైండ్ కాగా ఈ పాత్రకు నితిన్ ఒప్పుకోవడం పెద్ద రిస్క్ అయితే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను తమన్నా ఒప్పుకోవడం ఇంకా పెద్ద రిస్క్.. కథ ప్రాధాన్యం ఉన్న సినిమా కావడంతో తమన్నాసినిమా కి ఒప్పుకుందని అంటున్నారు...  

సినిమా తో పాటు నితిన్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. మొత్తానికి 2021లో నితిన్ నుంచి మూడు సినిమాలొస్తాయ‌న్న‌మాట‌. `అంధాధూన్‌` త‌ర‌వాత నితిన్ చేయ‌బోయే సినిమా ఖ‌రారైపోయింది. కృష్ణ చైత‌న్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. గీత ర‌చ‌యిత‌గా త‌న ప్ర‌యాణం మొద‌లెట్టారు కృష్ణ చైత‌న్య‌. నారా రోహిత్ తో `రౌడీ ఫెలో` తెర‌కెక్కించాడు. ఆ త‌ర‌వాత‌.. నితిన్ తో `ఛ‌ల్ మోహ‌న‌రంగ‌` తీశాడు. `ఛ‌ల్ మోహ‌న‌రంగ‌` ఫ్లాప‌య్యింది. ఆ త‌ర‌వాత‌.. కృష్ణ చైత‌న్య పూర్తిగా పాట‌ల‌పైనే దృష్టి పెట్టాడు. ఇప్పుడు నితిన్ త‌న‌కు మ‌రో ఛాన్స్ ఇచ్చాడు. దీనికి `ప‌వ‌ర్ పేట‌` అనే టైటిల్ ప్రచారంలో ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ద‌ర్శ‌కుడిగా కృష్ణ చైత‌న్య‌ని ఎంచుకున్నారు. మే నుంచి ఈ సినిమా ప‌ట్టాలెక్కొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: