నందమూరి బాలకృష్ణ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ ‌లో ముచ్చటగా మూడోసారి మరొక  సూపర్ హిట్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే . వీరిద్దరి కాంబినేషన్ లో అంతకముందు వచ్చిన రెండు సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. మళ్ళీ మూడోసారి ఈ కాంబినేషన్ లో మరొక సినిమా రాబోతుంది. ఈ సినిమా మీద ప్రేక్షకులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా మే 28న  ధియేటర్లలో సందడి చేయనుందని  ఆసినిమా  నిర్మాతలు, ద్వారక క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించారు.అలాగే ఈ సినిమాలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ప్రముఖ  నటి పూర్ణ  ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. అది కూడా నెగిటివ్ రోల్‌లో నటిస్తున్నట్టు తెలిసింది.


 పూర్ణ అవును, అవును 2 సినిమాల్లో నటించడంతో పాటు  అల్లరి నరేష్ సరసన నటించి మంచి పేరు తెచ్చుకున్నది. ఇప్పుడు ఏకంగా మన నటసింహం బాలయ్య బాబుతోనే ఢీ కొట్టడానికి రెడీ అయింది. ఈ సినిమాలో బాలయ్యకు వ్యతిరేకమైన పాత్రలో నటించి  ఫుల్ క్రేజ్ దక్కించుకోవడం ఖాయమని చెబుతున్నారు. ఇటీవల రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన పవర్ ప్లే సినిమాలో కూడా పూర్ణ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో  విలన్‌గా నటించింది.


ఇందులో ఒక డ్రగ్ బాధితురాలుగా పూర్ణ చేసిన  విలనీ సూపర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలయ్య, బోయపాటి సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ సినిమాలో పూర్ణ తో పాటుగా,  శ్రీకాంత్ కూడా  ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు.  ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా సమ్మర్ లో అభిమానులకు ఒక మంచిది కిక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.. !

మరింత సమాచారం తెలుసుకోండి: