హాట్ బ్యూటీ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస సినిమాలతో దూసుకుపోతూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ కోలీవుడ్ లలో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది.టాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు సైతం రష్మిక మందన్నా గట్టి పోటీని ఇస్తున్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో రెండు హిందీ సినిమాలు ఉన్నాయి. సిద్దార్థ్ మల్హోత్రాకు జోడీగా మిషన్ మజ్ను సినిమాలో నటిస్తున్న రష్మిక ఈ సినిమాతో పాటు అమితాబ్ బచ్చన్ తో గుడ్ బాయ్ అనే సినిమాలో నటిస్తున్నారు.


ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటుండగా ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమాలు రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.తన తల్లిదండ్రులు అమితాబ్ బచ్చన్ కు ఫ్యాన్స్ అని అమితాబ్ నటించిన సినిమాలను వాళ్లు తప్పకుండా చూస్తారని రష్మిక చెప్పింది.గుడ్ బాయ్ సినిమాలో అమితాబ్ బచ్చన్ కు కూతురు పాత్రలో రష్మిక నటిస్తుంది.సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని సంవత్సరాల్లోనే రష్మిక లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం గమనార్హం. మరోవైపు రష్మిక తెలుగులో పుష్ప సినిమాతో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తున్నది.


ఈ రెండు సినిమాలు హిట్టైతే రష్మికకు తెలుగులో ఆఫర్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మికకు వరుస ఆఫర్లు వస్తుండటంతో రష్మిక రాబోయే రోజుల్లో టాలీవుడ్ కు గుడ్ బై చెప్పబోతుందట. ఇక ఈమె పద్ధతి పై టాలీవుడ్ ప్రేక్షకులు మండి పడుతున్నారు. నువ్వింత పెద్ద స్టార్ హీరో అవ్వడానికి కారణం టాలీవుడ్ అని మర్చిపోకు అని కామెంట్లు చేస్తున్నారు. పధ్ధతిగా ఉంటే సమంత లా మంచి స్టార్ హీరోయిన్ అవుతావు. లేకుంటే బాలీవుడ్ యే ముద్దు టాలీవుడ్ వద్దు అనుకుంటే ఖచ్చితంగా ఇలియానా లా బొక్క బోర్లా పడతావని టాలీవుడ్ ఆడియన్స్ హెచ్చరిస్తున్నారు. మరి రష్మిక పద్ధతి మార్చుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: