విలక్షణ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ పూరి జగన్నాథ్. హిట్ ఫ్లాప్ అని సంబంధం లేకుండా ఆయన వరుసగా సినిమాలు చేస్తూ ఉంటారు.. ఇస్మార్ట్ శంకర్ సినిమా తో హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చిన ఆయన విజయ్ దేవరకొండ తో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ఫైటింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అయితే ఈ సినిమా మీద ఉన్న బజ్ ను పూరీ జగన్నాథ్ సరిగా వాడుకోలేక పోతున్నారు ఏమో అనిపిస్తోంది. 

బాలీవుడ్ లో కరణ్ జోహార్ తో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్న పూరి జగన్నాథ్ దాదాపు ఇప్పటికే 50 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి చేశాడు. మిగతా దర్శకులు హీరోలు అందరూ వరుసపెట్టి సినిమాలు లైన్లో పెట్టుకుంటున్నా ఆయన మాత్రం ఈ సినిమా పూర్తి చేసేందుకు కూడా ఆసక్తి చూపించకపోవడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు పూరి జగన్నాథ్ ఎక్కడ ఉంటున్నాడు ? షూటింగ్ కోసం అసలు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా ? అనే చర్చ ప్రస్తుతానికి టాలీవుడ్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. 

వాస్తవానికి పూరి జగన్నాథ్ చాలా స్పీడ్ గా సినిమాలు తీస్తాడనే పేరుంది. అలాంటిది ఈ సినిమా గురించి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నాడు ? అనే చర్చ ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ వర్గాల్లో కూడా జరుగుతోంది. మరి తన స్టైల్ కు భిన్నంగా ఎందుకు ఇంత లేట్ చేస్తున్నాడో ఆయనకే తెలియాలి. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ - పూరి కాంబినేషన్ కావడంతో ఈ సినిమా మీద జనాల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: