నాచురల్ స్టార్ నాని  వరుసగా సినిమాలని లైన్ లో పెడుతున్నాడు.  ఆయన హీరోగా మూడు సినిమాలు వెంట వెంటనే విడుదల కాబోతున్నాయి. తన హిట్ దర్శకుడు శివ నిర్వాణతో తెరక్కించిన “టక్ జగదీష్” కాగా మరొకటి దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తో చేస్తున్న “శ్యామ్ సింగ రాయ్”. రాహుల్ సంకృత్యన్ గతంలో విజయ్ దేవరకొండ దర్శకత్వంలో వచ్చిన టాక్సీవాలా అనే సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.అయితే ఈ శ్యామ్ సింగరాయ్ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు నిర్మాతలు.

ఇప్పుడు హైదరాబాద్ లో ఏకంగా 6 కోట్లతో భారీ సెట్ ని వేసి అందులో షూటింగ్ చేస్తారట.ఈ సెట్ ని ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కోళ్ల డిజైన్ చేస్తున్నారు.ఇక నాని సినిమాల్లో ఈ రేంజ్ లో ఖర్చుపెడుతున్న సినిమా ఇదే అంట. కలకత్తా నగరం నేపథ్యంలో బ్రిటీష్ కాలంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. ఒక వింటేజ్ డ్రామాలా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్స్ సాయి పల్లవి, కృతి శెట్టిలు నటిస్తుండగా.. తాజాగా ఈ సినిమాలోకి మరో టాలెంటెడ్ నటుడు వచ్చినట్టుగా తెలిపింది చిత్రబృదం. అతడే బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా. తెలుగులో తాను చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ మంచి ఇంపాక్ట్ మరియు ఇంప్రెస్ ను తెచ్చుకోగలిగాడు.

 గతంలో జిష్షు సేన్ గుప్తా నితిన్ భీష్మా, నాగ శౌర్య అశ్వాద్థామ సినిమాల్లో కనిపించాడు. ఇక తాజాగా నాని సినిమాతో పాటు చిరంజీవి ఆచార్యలో కూడా జిష్షు సేన్ గుప్తా కనిపించనున్నాడని తెలుస్తోంది.ఇక నాని శ్యామ్ సింగరాయ్ సినిమా విషయానికి వస్తే... ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. చూడాలి నాని ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ కొడతాడో.

మరింత సమాచారం తెలుసుకోండి: