కేజీఎఫ్ సినిమాతో కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో హీరో యశ్ ను ఎలివేషన్స్ తో అద్భుతంగా చూపించాడు. ఇక ఆ సినిమా సీక్వెల్ అయిపోయాక ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా సలార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడని ఫ్యాన్స్ ఎంతగానో అంచనాలు పెంచుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలో ప్రభాస్ ను యశ్ కు మించి చూపిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 2022 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. వచ్చే ఏడాది ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాతో పాటు ఆదిపురుష్ సినిమా కూడా రిలీజ్ కానుండటం ప్రభాస్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో శృతిహాసన్ నటిస్తుంది.


శృతిహాసన్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అయినా శృతిహాసన్ ప్రభాస్ తో కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాలో శృతిహాసన్ జర్నలిస్ట్ రోల్ లో నటిస్తున్నదని వార్తలు వస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలోని హీరోయిన్ పాత్రను రియల్ జర్నలిస్ట్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారని సమాచారం అందుతుంది.అయితే చిత్రయూనిట్ నుంచి ఈ మేరకు అధికారక ప్రకటన రావాల్సి ఉంది. అయితే సినిమాలో శృతిహాసన్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నదని జరుగుతున్న ప్రచారం వల్ల ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.ఇక శృతిహాసన్ గతంలో సింగం 3 సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో శృతి జర్నలిస్ట్ పాత్రను పోషించగా బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా సక్సెస్ కాలేదు. అందుకే ఫ్యాన్స్ భయపడుతున్నారట.శృతి సలార్ సినిమాతో ఆ ఫ్లాప్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: