ఇక అంకిత సుశాంత్ కంటే వయసులో పెద్దది.అయినా కూడా ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. పవిత్ర రిస్తా సీరియల్ తో ఇద్దరు బాగా ఫేమస్ అయ్యారు. అప్పట్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బుల్లితెరపై నెంబర్ వన్ హీరో. అలాంటి స్థానం వదులుకొని సినిమాల కోసం వెళ్ళిపోయాడు సుశాంత్. అక్కడ కూడా వరుస హిట్లు అందుకుంటూ సూపర్ సక్సెస్ అయ్యి పెద్ద స్టార్ హీరో అయ్యాడు. సినిమాల్లో స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత కూడా తన ప్రేయసి అంకితను వదిలిపెట్టలేదు సుశాంత్ సింగ్. ఇద్దరు పెళ్లి చేసుకుంటామని కూడా చెప్పారు. అయితే ఉన్నట్టుండి 2016లో ఇద్దరు విడిపోయారు. దీనికి కారణాలు ఏంటి అనేది అప్పట్లో ఎవరికీ తెలియదు.
తర్వాత ఎవరూ పట్టించుకోలేదు కూడా. అంకితతో విడిపోయిన తర్వాత కృతి సనన్, రియా చక్రవర్తి లతో ప్రేమలో పడ్డాడు సుశాంత్ సింగ్. మరోవైపు అంకిత కూడా మరో సీరియల్ నటుడితో సహజీవనం మొదలు పెట్టింది. అయితే ఇన్ని రోజుల తర్వాత ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా అంకిత.. తాను సుశాంత్ నుంచి ఎందుకు విడిపోయాననేది చెప్పింది. అప్పట్లో తనకు కెరీర్ ముఖ్యం.. కొన్ని రోజులు ఇవన్నీ వద్దు అన్నందుకు.. సామరస్యంగా ఒకరినొకరు అర్థం చేసుకుని విడిపోయాము.. అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు అని క్లారిటీ ఇచ్చింది. కేవలం కెరీర్ కోసమే సుశాంత్ తనతో విడిపోయాడు అంటూ చెప్పుకొచ్చింది. బ్రేకప్ అయిన తర్వాత ఒకరి గురించి ఒకరు పెద్దగా పట్టించుకోలేదు అని చెప్పింది. కానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయిన తరువాత మాత్రం కొన్ని రోజులు తనలో తాను కుమిలిపోయి తీవ్రంగా బాధ పడిందట అంకిత.