ప్రస్తుతం టాలీవుడ్‌లో బయోపిక్‌ల పరంపర నడుస్తుందనే చెప్పుకోవాలి. ప్రతి హీరో, హీరోయిన్‌ కూడా బయోపిక్ అంటే వెంటనే ఓకే చేసేస్తున్నారు. టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లోనూ ఇదే పరిస్థితి. కేవలం నటీనటులే కాదు ప్రేక్షకులు కూడా బయోపిక్‌లంటే భారీ క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే హిందీలో భారత మాజీ క్రికెటర్, కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత కథను రన్‌వీర్ హీరోగా ‘83’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం రన్‌వీర్ కూడా తెగ కష్టపడుతున్నాడు. అయితే ఇప్పుడు మరో క్రికెటర్ జీవిత కథను కూడా తెరకెక్కించనున్నారట. ఈ మేరకు వార్తలు ప్రస్తుతం సినీ సర్కిల్స్‌లో, నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
 తాజాగా భారత్ దిగ్గజ ఆటగాడు, బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రావిడ్ జీవిత కథను తెరకెక్కించేందుకు సిద్దమయ్యారట. ఇందుకోసం సిద్దం చేసిన కథను ద్రావిడ్‌కు కూడా వినిపించారట. కథ విన్న వెంటనే ద్రావిడ్ అంత సమాచారం ఎక్కడ దొరికిందని ఒకింత ఆశ్చర్యపోయినా, కథను మరల్చిన తీరును మెచ్చుకున్నారట. ఈ సినిమాలో ద్రావిడ్ పాత్ర కోసం తమిళ హీరో సిద్దార్థను ఫిక్స్ చేశారట. ఈ విషయాన్ని కూడా ద్రవిడ్‌కు చెప్పారట. వాటికి కూడా ద్రవిడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఈ మేరకు వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ బయోపిక్‌కు సంబంధించి అధికారిక ప్రకటనేమీ రాలేదు. త్వరలో ఏమైనా ప్రకటిస్తారేమో వేచి చూడాలి.


ఇదిలా ఉంటే సిద్దార్థ ప్రస్తుతం ‘మహాసముద్రం’ సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో రెండో హీరోగా శర్వానంద్ నటిస్తున్నాడు. ఈ చిత్రం భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ఒకరు నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నారట. సిద్దార్థ, శర్వాలలో ఎవరనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. దీనిపై క్లారిటీ రావాలంటే ‘మహాసముద్రం’ సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: