తెలుగు స్టార్ హీరోలలో ఒక్కరిగా రాణిస్తున్న హీరో బాలకృష్ణ. ఆయన వరుసగా స్టార్ డైరెక్టర్ల దర్శకత్వంలో కొత్త సినిమాలను ఒప్పుకున్నా సంగతి అందరికి తెలిసిందే. బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను ఒప్పుకున్నారు. ఇక జూన్ 10వ తేదీన బాలయ్య అనిల్ రావిపూడి సినిమా ప్రకటన రాకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందా..? అనే సందేహాలు తలెత్తున్నాయి.

ఇక తాజాగా జూమ్ మీటింగ్ లో అభిమానులతో బాలకృష్ణ మాట్లాడారు. ఆయన తన అభిమానులకు భవిష్యత్ ప్రాజెక్టులకు సంబంధించి వివరణ ఇచ్చారు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా తరువాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలోనే నటిస్తున్నానని బాలయ్య స్పష్టంగా తెలియజేశారు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమాతో బిజీగా ఉన్నారు.

ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి బిజీగా ఉండగా బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ సినిమా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా పూర్తి అవ్వగానే బాలయ్య అనిల్ కాంబో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

బాలకృష్ణ సినీ జీవితంలో ఎక్కువగా యాక్షన్ సినిమాలు వచ్చాయి. బాలయ్యకి కూడా యాక్షన్ సినిమాలు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే అనిల్ రావిపూడి తన సినిమాలో కామెడీ ఎక్కువగా ఉండేలా చూస్తారు. ఇక ఇప్పుడు అభిమానుల్లో ఓ సందేహం నెలకొంది. బాలయ్య స్టైల్ లో అనిల్ రావిపూడి సినిమాను తెరకెక్కిస్తారా..? లేక అనిల్ రావిపూడి స్టైల్ లో బాలయ్య సినిమా తెరకెక్కుతుందా..? అనే ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తాయి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ చిత్రానికి బాలయ్య పది కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: