ప్రస్తుతం దేశంలోని హీరోలు అందరూ ఒకే పేరుని జపిస్తున్నారు. ఆయనే ప్రశాంత్ నీల్. కేజిఎఫ్ సినిమా తో ఆయనకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. అప్పటి వరకూ కన్నడ పరిశ్రమ వరకే పరిమితమైన ఆయన ప్రభంజనం కె.జి.ఎఫ్ సినిమా తో దేశం అంతటా పాకింది. సినిమా విడుదలైన మొదటి రోజు నుండే ప్రశాంత్ నీల్ ఎవరు అనే విషయాన్ని కనుక్కోవడం మొదలుపెట్టారు హీరోలు. కే జి ఎఫ్ పార్ట్ 2  సినిమా విడుదల అయితే ప్రశాంత్ రేంజ్ ఏ లెవెల్ కి వెళుతుందో ఊహకే అందదు.

ఈ నేపథ్యంలోనే ఆయన వరుసగా టాలీవుడ్ హీరోలతో సినిమాలను ఓకే చేసుకున్నాడు. బాహుబలి తో వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్.  ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కూడా చేస్తున్నాడు. సొంత సినీ పరిశ్రమకు కూడా కాదని టాలీవుడ్ లో సినిమాలు చేయడం అక్కడివారికి నచ్చకున్నా ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తో సినిమా ను చేయాలని ఎవరికి ఉండదు. ఎంతో మంది హీరోలు ఆయనకోసం వెయిట్ చేస్తున్నారు అన్నది వాస్తవం.

అలాంటి దర్శకుడితో పని చేసే ఛాన్స్ వస్తే ఏ హీరో అయినా ఎగిరి గంతేస్తాడు. కానీ మహేష్ బాబు మాత్రం ప్రశాంత్ చెప్పిన ఓ కథని రిజెక్ట్ చేశాడని టాలీవుడ్ లో వార్తలు జోరుగా  వస్తున్నాయి. దానికి ఒక కారణం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రశాంత్ యాక్షన్ సీన్స్ ని ఓ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. కథలో భాగంగా కొన్ని సంఘటనలను మహేష్ వికువలైజ్ చేసుకోలేకపోయాడట, దాంతో రిస్క్ చేయడం ఎందుకని సున్నితంగా నో చెప్పాడని అంటున్నారు.  అయితే ఇదే కథని ప్రశాంత్ ఎన్టీఆర్ తో చేయబోతున్నాడట. మొత్తానికి మహేష్ చేయాల్సిన సినిమా ఎన్టీఆర్ చేయబోతున్నాడన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: