నాచురల్ బ్యూటీ సాయి పల్లవి తెలియని ప్రేక్షకులు తెలుగునాట లేనరనడంలో సందేహం అక్కర్లేదు. కేరళ ‘ప్రేమమ్’ సినిమాతో హీరోయిన్‌‌గా వెండితెరకు పరిచయం అయిన ఈ చిన్నది తెలుగులోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంది. 2017లో వచ్చిన ‘ఫిదా’ సినిమాతోనే ప్రేక్షకులు అమ్మడికి ఫిదా అయిపోయారు. ఆ తరువాత వరుస సినిమాలతో ఆకట్టుకున్న ఈ చిన్నది తనదైన నటన, నాట్యం, అందం, అభినయంతో కుర్రాకారు మనసులు కాజేసింది. ది బెస్ట్ అనిపించుకుంది. ఇటీవల సారంగధరియా పాటతో సోషల్ మీడియాను ఊపేసిన ఈ చిన్నది ఇప్పుడు తాజాగా మరో ఘనతను సాధించింది. ఏ హీరోయిన్‌కి లేని విధంగా సాయి పల్లవి ఈ ఘనతను తన ఖాతాలో వేసుకుంది.
ఇంతకీ సాయిపల్లవి సాధించిన ఘనత ఏంటని ఆలోచిస్తున్నారా.. ప్రస్తుతం టాలీవుడ్‌ హీరోయిన్‌లలో ఎవరూ కూడా వరుస సినిమాలను విడుదల చేయడంలేదు. అందులోను కేవలం ఆరునెలల్లో అస్సలు జరగడం లేదు. అయితే సాయిపల్లవి సాధించిన ఘనత అదే. రానున్న ఆరునెలల్లో ఈ బ్యూటీ నటించిన వరుసగా మూడు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. మూడు సినిమాల్లోనూ వేరువేరు పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేసేందుకు సిద్దమవుతుంది. ఒక పాత్రకి మరో పాత్రకి ఏ మాత్రం పోలిక ఉండదు. అటువంటి వైవిధ్యమైన పాత్రలతో సాయి పల్లవి అభిమానులను అలరించేందుకు సిద్దమవుతోంది. వాటిలో మొదటిది అక్కినేని హీరో నాగచైతన్య సరసన నటించిన ‘లవ్ స్టోరీ’, ఆ తరువాత టాలీవుడ్ భల్లాలదేవ రానాతో అమ్మడు చేసిన ‘విరాటపర్వం’, నాచురల్ స్టార్ నాని, నాచురల్ బ్యూటీ సాయిపల్లవి కలిసి నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ ఈ మూడు సినిమాలు ప్రస్తుతం విడుదలకు సర్వం సిద్దం అయ్యాయి. కరోనా తగ్గి థియేటర్లు తెరుచుకుంటే ఈ మూడు సినిమాలు ఒకదాని తరువాత మరొకటిగా విడుదల కానున్నాయి.
అంతేకాకుండా ఈ మూడు సినిమాలపైన అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. లవ్ స్టోరీ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదలయితే అందులో ఉన్న సారంగధరియా పాటలో సాయిపల్లవి డాన్స్ చూడాలని కుర్రకారు ఉర్రూతలూగిపోతున్నారు. అదే విధంగా ‘విరాటపర్వం, శ్యామ్ సింగరాయ్’ సినిమాల్లో అమ్మడి పాత్ర ఎలా ఉంటుంది. అందులో నాచురల్ బ్యూటీ ఎంతలా మెప్పిస్తుందని ప్రేక్షులు వేచి చూస్తున్నారు. మరి వారి ఎదురుచూపులకు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: