బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్  ప్రభాస్‌ కు కి కొన్ని కొత్త ఇబ్బందులని తెస్తుంది అని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అది ఎలాగ అంటే ప్రభాస్‌ ఈ మధ్య తనకు నచ్చిన స్క్రిప్ట్స్ కు ఓకే చెబుతూ వెళుతున్నా విషయం తెలిసిందే.ఇలా వరసగా సినిమాలు ఒప్పుకోవడం వలన ఆయన మరో మూడు, నాలుగేళ్ళ వరకూ ప్రభాస్‌ ఖాళీగా ఉండని పరిస్థితి ఏర్పడింది.ఒక సినిమా షూటింగ్ అయిపోగానే ఇంకొక సినిమా షూటింగ్ ఒక్కొక్క షూట్ ఒక్కో ప్లేస్ లో ఉండటంతో ప్రభాస్ కి ఈ మధ్య  విశ్రాంతి లేకుండా పోయింది అని టాక్.

అలాగే ఆయనకి ఈ మద్య మెడ నొప్పి కూడా ఎక్కువైపోయింది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ షూటింగ్స్ అన్నిటికి ఒక నెల రోజులు ఆపేసి ఆయన విదేశాలకి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నారు అని ఆయన సన్నిహితులు తెలిపారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న  రొమాంటిక్ మూవీ ‘రాధేశ్యామ్’ త్వరలోనే విడుదలకి సిద్ధంగా ఉంది.ఇక  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న ‘సలార్’ షూటింగ్ మరియ  బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ త్రీడీ మూవీ ‘ఆదిపురుష్’ షూటింగ్ రెండింటిలో ప్రభాస్ ప్రస్తుతం పాల్గొంటున్నారు.ఇక ఈ రెండు సినిమాలు ఈ ఏడాది చివరికి పూర్తి అయితే వచ్చే ఏడాదిలో ప్రభాస్ నాగ అశ్విన్ సినిమా మీద ఫోకస్ పెడతాడట.

ఈ  సోషియో ఫాంటసీ సైంటిఫిక్ మూవీ బడ్జెట్ 700 కోట్లు అని టాక్. ఇక  ప్రభాస్ ఇంకొక బాలీవుడ్ డైరెక్టర్  సిద్ధార్థ్ ఆనంద్ తో సినిమా చేయడానికి ఒకే చెప్పారట. అలానే సలార్‌ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఇంకొక సినిమా దిల్ రాజు నిర్మాతగా చేస్తున్నారు. ఇన్ని సినిమాలు లైన్ లో ఉన్న కూడా ప్రభాస్ ఇంకా కొత్త కథలు వింటూనే ఉన్నారట. ఆయన అభిమానులకి ఒకప్పటిలాగా ప్రతి సంవత్సరం ఒక సినిమాని ఇవ్వాలి అని ప్రభాస్ అనుకుంటున్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల వలన అది మాత్రం జరగట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: