దాదాపు రెండు నెలల నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎలక్షన్ల గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈసారి ఎన్నికలలో చాలా మంది స్టార్స్ నిలబడ్డారు. అయితే ఇలా వీరంతా నిలబడడం తో ఈ ఎన్నికలు చాలా రసవత్తరంగా మారాయి. ఇక ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎవరు గెలుస్తారనే వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి. అయితే ఇదే క్రమంలో  ఒకరిని ఏకగ్రీవం చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది మా పెద్దలు ఆలోచిస్తున్నారు. ఇంతకూ వారెవరో తెలుసుకుందాం.


మా ఎన్నికల కోసం  సినీ ఇండస్ట్రీ వాళ్లు చేసిన పనివల్ల, మా ఎన్నికల పరువు మొత్తం పోతోందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ సినీ ఇండస్ట్రీలో పెద్దలు మాత్రం ఏకగ్రీవం వైపే బాగా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరికొంతమంది రాజకీయాల మాదిరి ఈ మా  ఎలక్షన్ లను చేస్తున్నారని కామెంట్స్ కూడా  వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు పెద్దలలో వినిపిస్తున్న మాట ఏమిటంటే.. ఒకప్పుడు పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నటికి, ఈ పదవి ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఆమె ఎవరో కాదు అలనాటి తార జయసుధ . ఈమెను ఏకగ్రీవం చేయబోతున్నట్లు సినీ ఇండస్ట్రీలో తెలుస్తోంది. కానీ కొంతమంది మటుకు ఏకగ్రీవం కి మొగ్గు చూపలేదు. కానీ మరి కొంతమంది ఎలక్షన్లు జరగాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నారట. దీంతో మా పెద్దలు తమ పరువు నిలబెట్టుకుంటారో..? లేదో..?  అనే విషయం పై కొద్ది రోజులు ఆగాల్సిందే.
ముఖ్యంగా ఎలక్షన్లు జరిగితే మాత్రం మంచు ఫ్యామిలీ, ప్రకాష్ రాజ్ మధ్య పోటీ చాలా విపరీతంగా ఉంటుందని వినికిడి వినిపిస్తోంది. ఇక ప్రకాష్ రాజు కు మెగా ఫ్యామిలీ నుంచి మద్దతు ఉండగా, మంచు ఫ్యామిలీ వారికి బాలకృష్ణ మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మా ఎలక్షన్స్ లో అధ్యక్ష పదవి సాధిస్తే," మా బిల్డింగ్ " కట్టిస్తానని మంచు విష్ణు హామీ కూడా ఇచ్చారు.. ఇక అయితే మా పెద్దలు ఏకగ్రీవం చేస్తారో,  లేక ఎలక్షన్స్ నిర్వహిస్తారో వేచిచూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: