ధనుష్ నటించిన తమిళ సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే అసురన్ రీమేక్ గా నారప్ప తెరకెక్కగా త్వరలో మరో ధనుష్ సినిమా కూడా రీమేక్ అవబోతుందని అంటున్నారు. అసురన్ రీమేక్ ను వెంకటేష్ రామేక్ చేసి మెప్పించారు. నారప్పగా ధనుష్ స్థానంలో వెంకటేష్ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ధనుష్ నటించిన మరో సినిమా మీద తెలుగు దర్శక నిర్మాతల ప్రయత్నాలు మొదలు పెట్టారు.

అసురన్ తర్వాత ధనుష్ నటించిన కర్ణన్ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. మారి సెల్వ రాజ్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను కళైపులి ఎస్ థాను నిర్మించారు. ఈ సినిమా లో కూడా ధనుష్ తన నటనతో మెప్పించాడు. అయితే ధనుష్ అసురన్ సూపర్ హిట్ కాగా తెలుగులో రీమేక్ ప్రయత్నాలు జరుగగా ఇక ఇప్పుడు కర్ణన్ సినిమా రీమేక్ పై టాలీవుడ్ లో బిగ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి.

కర్ణన్ సినిమాను కూడా నారప్ప సినిమా రీమేక్ చేసిన శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తారని అంటున్నారు. అయితే హీరో నిర్మాతల విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. నారప్ప చేశాడు కాబట్టి వెంకటేష్ కర్ణన్ సినిమా చేస్తాడా అన్న డౌట్ రాక మానదు. అయితే కర్ణన్ రీమేక్ రైట్స్ కూడా సురేష్ బాబు తీసుకుంటే మాత్రం ఆ సినిమాలో కూడా మనం విక్టరీ వెంకటేష్ ను చూసే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ధనుష్ సినిమాలకు తెలుగులో సూపర్ క్రేజ్ వచ్చిందని మాత్రం చెప్పొచ్చు. అందుకే శేఖర్ కమ్ముల డైరక్షన్ లో ధనుష్ చేస్తున్న సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కూడా ధనుష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను కూడా అలరించాలని చూస్తున్నాడు ధనుష్.
 

మరింత సమాచారం తెలుసుకోండి: