పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అత్తారింటికి దారేది , అజ్ఞాతవాసి అనే రెండు సినిమాలు కూడా వచ్చాయి. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భీమ్లా నాయక్' సినిమాకు పవన్ కళ్యాణ్ కోరిక మేరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేను అందిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఇలా పవన్ కళ్యాణ్ చేసే ప్రతి పనిలో తనకు ఎంతో సహాయం గా ఉండే త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మరోసారి పవన్ కళ్యాణ్ ఒక బాధ్యతను అప్పజెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా నిర్మాణ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్ కు పవన్ తన సొంత నిర్మాణ సంస్థ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ బాధ్యతల్ని కూడా తాజాగా అప్పగించినట్టుగా వార్తలు వస్తున్నాయి.

గత కొన్నేళ్లుగా ఈ బ్యానర్ పై రామ్ చరణ్ తో ఓ సినిమా నితిన్ తో ఓ మూవీతో పాటు యంగ్ టాలెంటెడ్ దర్శకులను ప్రోత్సహించాలి అని,  అలాగే వారితో ఓటీటీ ల కోసం చిన్న చిత్రాలని వెబ్ సిరీస్ లని నిర్మించాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేశారు. దీనికోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి ముందుకు సాగుతామని ప్రకటన కూడా చేశారు. కానీ ఈ ప్రకటనకు సంబంధించిన విషయం ఏ మాత్రం ముందుకు కదలలేదు. పైగా పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల నిర్మాణ సొంత పనులను చూసుకో లేక పోతున్నారు. దీనిని గమనించిన పవన్ కల్యాణ్ తన పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ బాధ్యతల్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అప్పజెప్పినట్లు వార్తలు వస్తున్నాయ్. ఈ విషయం పై త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: