టాలీవుడ్ యంగ్
హీరో నితిన్ ఇటీవలే మాస్ట్రో చిత్రంతో మంచి విజయం సాధించి ప్రేక్షకులను ఎంతగానో ఆలరిస్తున్నాడు. ఆయన గత రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీగా నిరాశపరచడంతో ఈసారి చేయబోయే
సినిమా తప్పకుండా హిట్ కొట్టాలని చెప్పి ఓ
బాలీవుడ్ రీమేక్
సినిమా ను చేసి తనకు సూపర్ హిట్ వచ్చేలా చేసుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రం తో బిజీగా ఉన్నాడు. కొత్త దర్శకుడు తో కలిసి ఈయన
మాచర్ల నియోజకవర్గం అనే
సినిమా చేస్తున్నాడు.
పొలిటికల్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ ఐయేస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు కాగా చిత్రబృందం వినాయక చవితి రోజున ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసింది. ఇక మాస్ట్రో చిత్రం ఇచ్చిన విజయోత్సాహంతో నితిన్ ఈ చిత్ర షూటింగ్ లో ఎంతో హుషారుగా పాల్గొనబోతున్నారు అని తెలుస్తుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
హీరోయిన్ గా కృతి శెట్టి నటించబోతుంది.
అయితే ఈ చిత్ర కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ఈ
సినిమా కథ పవన్
కళ్యాణ్ నటించిన
సినిమా కథను పోలి ఉందని ప్రేక్షకులు సోషల్
మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. పవన్ హీరోగా నటించిన తమ్ముడు
సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో బలాదూర్ గా తిరిగే పవన్
కళ్యాణ్ ఒక అమ్మాయిని ప్రేమించి మోసం పోవడమే కాకుండా తన కుటుంబ పరువును బజారుకీడుస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన కరాటే నేర్చుకునే కుటుంబం తలెత్తుకునేలా చేసి జీవితంలో విజయం సాధిస్తాడు అచ్చం ఇలాంటి నేపథ్యంలో నితిన్
మాచర్ల నియోజకవర్గం కథ కూడా ఉందట.