స్టార్ డైరెక్టర్ అయిన శ్రీనువైట్ల ఒకప్పుడు వరుస భారీ విజయాలతో దర్శకునిగా కెరీర్ ను కొనసాగించాడని అందరికి తెలుసు.ఈ మధ్య కాలంలో శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం అందుకోవడం లేదని కూడా అందరికి తెలిసిందే.

ప్రస్తుతం శ్రీనువైట్ల మంచు విష్ణుతో డి అండ్ డి సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. మహేష్ బాబు శ్రీను వైట్ల కాంబినేషన్ లో దూకుడు మరియు ఆగడు సినిమాలు తెరకెక్కగా దూకుడు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టింది ఆగడు మూవీ డిజాస్టర్ రిజల్ట్  చూసి మహేష్ ఫ్యాన్స్ గుండె పగిలిపోయింది..

అయితే శ్రీను వైట్ల మాత్రం మహేష్ బాబుతో మరో సినిమాను తెర్కకెక్కించి ఫ్యాన్స్ కు భారీ విజయం సాధించాలని ఆశ పడుతున్నాతాని  సమాచారం.దూకుడు సినిమా రిలీజై నేటికి పది సంవత్సరాలు కావడంతో శ్రీనువైట్ల మీడియాతో ముచ్చటించారని తెలుస్తుంది. మంచి కథ రాయడం కంటే కామెడీతో కూడిన కథ చేయడం కష్టమని శ్రీను వైట్ల తెలిపారని సమాచారం. సరైన కథలను ఎంచుకున్న ప్రతిసారి విజయాలు దక్కాయని శ్రీను వైట్ల చెప్పుకొచ్చారని తెలుస్తుంది.. తనకు, మహేష్ కు మధ్య బంధం బాగా కుదరడంతో దూకుడు హిట్టైందని ఆగడు సినిమాలో హీరో ఎలివేషన్ సన్నివేశాలకు మంచి పేరు వచ్చిందని శ్రీను వైట్ల చెప్పినట్లు సమాచారం.

 

తాను వరుసగా మూడు సినిమాలకు సైన్ చేసానని చెప్పాడట  శ్రీను వైట్ల.ఈ సినిమాల తర్వాత మహేష్ తో చేయాలని ఉందని శ్రీను వైట్ల వెల్లడించారని సమాచారం.మహేష్ కోసం అద్భుతమైన ఐడియా తన దగ్గర ఉందని చెప్పారట.ఆ ఐడియాను అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే మూవీగా తీయాలని ఉందని శ్రీను వైట్ల చెప్పినట్లు సమాచారం. మహేష్ బాబు శ్రీను వైట్లకు మరో ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి మరి. ఒక వేళ ఇచ్చిన మహేష్ ఉన్న ఈ బిజీ సినిమాలతో పెట్టుకుంటే వీరిద్దరి కాంబినేషను ఎన్ని సంవత్సరాలుకు వస్తుందో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: