హీరో సాయి ధరమ్ తేజ్ ఈ నెల 10వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. దాదాపుగా ఒక వారం.. ప్రేక్షకులను అభిమానులను ఈ విషయం కలిచివేసింది. ఎట్టకేలకు సాయిధరమ్ తేజ్ కోరుకున్నట్లుగా ఈ మధ్యన వార్తలు వినిపించాయి. ఇక అంతే కాకుండా త్వరలోనే డిశ్చార్జ్ అవుతున్నట్టుగా కూడా వైద్యులు తెలియజేశారు. ఇక ఎప్పటిలాగే సాయి ధరంతేజ్ మళ్లీ సినిమాలతో బిజీగా ఉండబోతున్నారు.

సాయి ధరంతేజ్ కు ప్రమాదం జరిగినప్పుడు అభిమానులు ,మెగా ఫ్యామిలీ, ఇలా అందరూ  సాయి ధరంతేజ్ త్వరగా కోలుకోవాలని ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇక టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన ఒక బ్యూటీ.. సాయి ధరమ్ తేజ్ ఒక వీడియోను పోస్ట్ చేసి తప్పకుండా కోలుకుంటారు అంటూ తెలియజేసింది.

అంతేకాకుండా ఆయన చిరునవ్వు మళ్ళీ చూడడం కోసం ఎదురు చూస్తున్నానంటు తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.ఇక తన మీద నాకు నమ్మకం ఉంది అంటూ ఒక స్పెషల్ వీడియో ని పోస్ట్ చేస్తూ తెలిపినది ఈమె. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు.. సాయి ధరంతేజ్ తో ఒకప్పుడు లవ్లో ఉన్నట్లు రూమర్స్ ఎదుర్కొన్న హీరోయిన్ లారిసా బోనేసి. ఈమె బ్రెజిల్ ప్రాంతాని కి చెందినది. సాయి ధరమ్ తేజ్ నటించిన తిక్క సినిమాలో హీరోయిన్ గా నటించింది.


సాయి ధరంతేజ్ త్వరగా కోలుకోవాలంటూ.. తిక్క సినిమా ఆడియో ఫంక్షన్ లో ఒక స్పెషల్ వీడియో ని తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి తెలియజేసింది. దీంతో సాయి ధరంతేజ్ మీద ఆమెకి ప్రేమ ఎంత ఉందో అన్నట్లుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక కొద్దిగా ఆలస్యంగా నైనా ఈ ఘటనపై స్పందించిన.. లేరిసా చాలా ఎమోషనల్ గా ఈ పోస్ట్ ని ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: