తెలుగు యంగ్ డైరెక్టర్ లలో ఒకరు అజయ్ భూపతి ఈయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మహాసముద్రం ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ హీరో శర్వానంద్ మరియు సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీ లో అతిధి రావు హయాతి, అను ఇమాన్యుల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా పై మొదటి నుండి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి, దానికి ప్రధాన కారణం దర్శకుడు అజయ్ భూపతి మొదటి సినిమా అయిన ఆర్ఎక్స్ 100 సినిమా తో ఒక మంచి సినిమాను తీసి అటు జనాల తో పాటు ఇటు విమర్శకుల ప్రశంసలు కూడా కొట్టేసాడు. అయితే ప్రస్తుతం ఈ క్రేజీ దర్శకుడి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో 'మహాసముద్రం' సినిమాపై జనాల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్రబృందం జనాల ముందుకు వదిలింది.

 ఈ ట్రైలర్ ను చూశాక ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు అజయ్ భూపతి మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 లో హీరోయిన్ మొదట చాలా మంచి గా , సాఫ్ట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత తన శారీరక సుఖం కోసం హీరో ను అనేక కష్టాలు పడేలా చేస్తుంది. ఈ ట్విస్ట్ సినిమా కు హైలెట్గా మారింది. మరియు ట్విస్ట్ సూపర్ అంటూ జనాలు కూడా ప్రశంసలు ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఈ దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహాసముద్రం సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర హైలెట్ గా ఉంటుంది అని , లాస్ట్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇస్తుంది అని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: