సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ప్రస్తుతం భారీ స్థాయిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌ను గ్లోబల్ స్థాయిలో తెరకెక్కించేందుకు రాజమౌళి ఎలాంటి కాంప్రమైజ్ చేయకుండా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ఆఫ్రికా అడవుల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. మొత్తం ఈ సినిమాలో సగానికి పైగా భాగం ఆ అడవి నేపథ్యంలోనే ఉంటుంద‌ని సమాచారం.


ఈ సినిమాలో మహేష్ బాబును ఇప్పటివరకు చూడని విధంగా కొత్త లుక్‌, కొత్త ఎనర్జీతో రాజమౌళి చూపించబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ముఖ్యంగా మహేష్‌లోని డ్యాన్సర్‌ను బయటకు తీసుకురావడానికి రాజమౌళి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో ఓ ఫోక్ సాంగ్‌కు ప్రాధాన్యత ఉండనుంది. ఆ పాటకు కీరవాణి అద్భుతమైన మ్యూజిక్ అందిస్తుండగా, రాజు సుందరం ప్రత్యేకమైన కొరియోగ్రఫీ రూపకల్పన చేస్తున్నాడు. ఆ ఫోక్ సాంగ్‌లో మహేష్ బాబు, హీరోయిన్ ప్రియాంక చోప్రా కలిసి కొత్త స్టైల్లో డ్యాన్స్ చేయబోతున్నారని యూనిట్ వర్గాలు వెల్లడించాయి.


మహేష్ స్టెప్స్‌, ప్రియాంక చోప్రా గ్లామర్‌, కీరవాణి ట్యూన్స్ కలయిక ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు. అలాగే ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అతని రోల్ కథలో ముఖ్యమైన మలుపుకు కారణమవుతుందట‌. ఈ సినిమాపై మరిన్ని ఆసక్తికర అప్డేట్స్‌ను నవంబర్ నెలలో అధికారికంగా ప్రకటించేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. మహేష్-రాజమౌళి కాంబినేషన్ నుండి భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఈ సినిమా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు విశ్వసిస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: